ఎం.ఎస్.రాజు నిర్మాతగా రూపొందిన 'మనసంతా నువ్వే'
సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఇలాంటి క్లాసిక్ హిట్ తీసిన వీ.ఎన్.ఆదిత్య...ఈ ఒక్క సినిమాతోనే టాప్
డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు
ఉదయ్ కిరణ్ -
రీమా సేన్ జంటగా నటించిన ఈ
సినిమా ప్రేమకథా చిత్రాల్లోనే మరపురాని మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దీనితో పాటు దర్శకుడిపై గౌరవం పెంచిన క్లాసిక్
సినిమా 'మనసంతా నువ్వే'. అయితే ఆ గౌరవం నిలబెట్టుకోవడంలో వీ.ఎన్ ఘోరంగా విఫలమయ్యారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. కాకపోతే అప్పుడప్పుడు సినిమాలకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలలో అలాగే సినిమాల మీద విశ్లేషణలు ఇస్తూ కనిపించారు.
రకరకాల కారణాలతో కొన్ని ఫ్లాపులు తీసి ఇరుకున పడ్డాడు.
సినిమా ఇండస్ట్రీలో ఫేట్ కూడా ఇంపార్టెంట్. అది తనకు కలిసి రాలేదు. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు కంబ్యాక్ అవుతున్నారాని తాజా సమాచారం. మనసంతా నువ్వే వంటి మరో అద్భుతమైన టైటిల్ ని ఎంచుకుని
సినిమా తీస్తున్నాడు. 'వాళ్లిద్దరి మధ్యా' అనే టైటిల్ ని ఫైనల్ చేశాడు. అంతేకాదు ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి కంబ్యాక్ అవుతానంటు ధీమాగా ఉన్నారు.
క్లాసిక్ ని తీసి తర్వాత. అక్కినేని నాగార్జునతో నేనున్నాను వంటి మరో మాస్ ఎంటర్టైన్మెంట్ కూడా తీసిన
ఆదిత్య ఆ తర్వాత వరుసగా వచ్చిన ఫ్లాపులతో డైలమాలో పడిపోయాడు. చాలా ఏళ్లుగా కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నప్పటికి ఏ ప్రాజెక్ట్ సెట్ అవలేదు. రాక రాక ఒక్క ఛాన్స్ వచ్చింది. మరి ఇప్పుడైనా బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అని ఈ
డైరెక్టర్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మన ఇండస్ట్రీలో లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన చాలా మంది దర్శకులు
సక్సెస్ కాలేక సర్ధుకున్నారు. చాలా తక్కువ మందికి మాత్రమే లక్ తిరిగొచ్చింది. మరి
ఆదిత్య లక్ ఎలా ఉందో చూడాలి.