చిరంజీవి,
కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దసరాకు లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో సెట్స్పైకి వెళ్లనున్న ఈ చిత్రం కోసం అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా
నయనతార, శృతిహాసన్,
తమన్నా,
అనుష్క లాంటి పెద్ద హీరోయిన్ల పేర్లు వినిపించాయి.
సైరా హిట్ తరువాత తమన్నానే ఈ సినిమాలో
హీరోయిన్ అని అందరు అనుకున్నారు కూడా. అయితే, స్టాలిన్
సినిమా తర్వాత చిరు త్రిషతో నటించాలని అనుకోవడంతో ఈ సినిమాలో చెన్నై
బ్యూటీ హీరోయిన్ అనే మాటలు బాగా వినపడ్డాయి. మొన్న ఆమధ్య ఈ సినిమాలో
త్రిష నటిస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ
త్రిష ఈ చిత్రంనుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది.
తాను చిరంజీవితో ఈ సినిమాలో నటించడంలేదని చెప్పుకొచ్చింది. ఆ
సినిమా దర్శక నిర్మాతలు కనుక నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాని ఈ
బ్యూటీ అంటుంది. గతంలో
సినిమా యూనిట్ త్రిషతో సంప్రదింపులు జరిపినమాట వాస్తవమే. అయితే రెమ్యూనరేషన్ విషయంలో కుదరలేదో, మరి ఇంకే కారణావల్ల వీలుకాలేదో.. మొత్తానికి
త్రిష ఈ చిత్రం నుంచి ఔట్ అయింది. త్రిషనే
హీరోయిన్ అని అనుకుంటున్న నేపథ్యంలో, ఆమె పక్కకు తప్పుకోవడంతో కొరటాలకు మల్లి పనిపడింది.
సినిమా ముహూర్తం అయితే ప్రారంభం అయింది కానీ, చిరు లాంటి పెద్ద స్టార్ పక్కన నటించడానికి ఏ
హీరోయిన్ ను తెరమీదకు
కొరటాల తెస్తారా అని అందరు ఆలోచనలో పడ్డారు. ముందుగా అనుకున్న విదంగా చివరకు
తమన్నా సెట్స్ పై కనిపిస్తుందని వార్తలు సినీ ఇండస్ట్రీలో వినపడుతుంది. ఏది ఏమైనా చిరు ఈ వయసులో కూడా గ్యాప్ లేకుండా నటిస్తున్నారు. ఈ
సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయితే కానీ,
హీరోయిన్ తెరపై రాదని అర్థమవుతుంది.