బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 90 రోజులకు పైగా అలరించిన ఈ రియాల్టీ షోలో ప్రస్తుతం ఇంటిలో ఐదుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. శుక్రవారంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సీజన్ 3 టైటిల్ విన్నర్ పై రకరకాల పేర్లు వినపడుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే శ్రీముఖి రాహుల్ మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో లాస్ట్ వీక్ అయిన సందర్భంలో హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు బిగ్ బాస్. విషయంలోకి వెళితే సీజన్ 3 లోకి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇంటి సభ్యులందరూ శుక్రవారం సడన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ కావడంతో ఇంటిలో మిగిలి ఉన్న సభ్యులు అందరూ షాక్ తిన్నారు.


ఇంటి నుండి ఎలిమినేట్ అయిన హేమ జాఫర్‌, అషూ రెడ్డి, రోహిణి, వితిక, పునర్నవి, రవి, మహేశ్‌, శివజ్యోతి, హిమజ, తమన్నా, శిల్పా చక్రవర్తి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ పిచ్చి సందడి సందడి చేశారు. ఇంటిలో ఉన్న సభ్యులతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఇంటిలో ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లు బయట ఎటువంటి వాతావరణం నెలకొంది వంటి విషయాలను తెలుసుకుంటూ బయట ప్రపంచంతో అప్డేట్ అవ్వడానికి మిగిలి ఉన్న ఇంటి సభ్యులు ట్రై చేస్తున్నారు.


ఇదిలావుండగా సీజన్ 3 మొదలైన తరువాత మొట్టమొదటి ఎలిమినేట్ ఇంటి నుండి అయిన కంటెస్టెంట్ గా బయటకు వచ్చిన నటి హేమ బయట ఇంటర్వ్యూ లిస్టు తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టను అని నాకు హౌస్ లో అవమానం జరిగిందని చాలా ఇంటర్వ్యూలలో మాట్లాడిన హేమ మళ్లీ బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టడం విశేషం. శ్రీముఖి అతివినయం చూపిస్తూ హేమ కాళ్లు పట్టుకోబోయింది. వెంటనే హేమ ‘వద్దమ్మా’ అంటూ ఆమెకో దండం పెట్టి పెద్ద షాకే ఇచ్చింది. ఇక హేమ బిగ్‌బాస్ అనేది ఓ చెత్త అని… అక్క‌డ శ్రీముఖికి అంతా ఫేవ‌ర్‌గా జ‌రుగుతోంద‌ని కూడా విమ‌ర్శ‌లు చేసి ఇప్పుడే ఇంటిలోకి హేమ ప్రవేశించడంతో చూస్తున్న వీక్షకులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: