తాజాగా  మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన భార్య చేసిన వైరల్ సోషల్ మీడియా పోస్ట్ గురించి స్పందించడం జరిగింది. మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు కార్యక్రమాలను చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాలకు మాత్రం బాలీవుడ్ సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించడం జరిగింది. ఒక్క దక్షిణాది నటుడికి కానీ దర్శకుడికి కానీ ఆహ్వానించడం జరగలేదు.


ఈ విషయంపై కొన్ని రోజుల క్రితం రామ్‌చరణ్ సతీమణి ఉపాసన బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది. ‘మోదీగారు.. దక్షిణాది వారమైన మేము కూడా ప్రధానిగా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. అయితే కళాకారులతో జరిగిన సమావేశాన్ని కేవలం హిందీ నటీనటులకు మాత్రమే పరిమితం చేసి దక్షిణాది కళాకారులను పట్టించుకోకపోవడం బాధించింది’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ఉపాసన.


ఈ విషయంపై  నటి ఖుష్బూ కూడా బాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబయి అయినంత మాత్రాన అక్కడి నటీనటులనే వేడుకలకు ఆహ్వానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మోదీ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవిలను ఓ సమావేశానికి ఆహ్వానించారు. త్వరలో తండ్రీ కొడుకులు దిల్లీలోని పీఎంఓ కార్యాలయంలో మోదీని కూడా కలవబోతున్నారు. అయితే ఉపాసన చేసిన ట్వీట్‌పై తాజాగా రామ్ చరణ్ స్పందించడం జరిగింది. ఉపాసన అలా కామెంట్ చేసిన విషయం తనకు అస్సలు తెలీదని చరణ్ తెలిపారు. ఒకవేళ మోదీని ఉద్దేశిస్తూ ఉపాసన ట్వీట్ చేస్తున్నట్లు తనకు తెలిసుంటే అలా చేయకుండా చూసేయవాదిని అని తెలిపాడు.


ఇక చెర్రీ వర్క్ విషయానికొస్తే ఇటీవల ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో నిర్మాతగా మంచి విజయం సొంతం చేసుకున్నారు. కొద్దిరోజులు విరామం తీసుకున్నాక ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్‌లో మొదలు పెట్టారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఓ షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్‌ను వేగంగా చేస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆలియా భట్ రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్నారు. 2020 జూన్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: