జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'పింక్' అనే హిందీ సినిమా రీమేక్ లో నటిస్తున్నట్లు ప్రముఖ ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ సోషల్ మీడియా లో ప్రకటించారు. పవన్ కళ్యాణ్ రాజకీయం లో అరంగేట్రం చేసినప్పటినుంచి సినిమాలోకి మళ్ళీ రావడానికి అంతగా మక్కువ చూపించలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా అంతగా ప్రజలో ఆదరణ పొందకపోవడంతో, పవన్ కళ్యాణ్ సినిమాలకి గుడ్బై చెప్పి పూర్తిగా రాజకీయంపై శ్రద్ధపెట్టారు. 


ఈ మధ్య కాలంలో పవన్ సినిమాలు చేస్తున్నారన్న వార్తలను ఆయన ఖండిస్తూవచ్చారు. కానీ, యం.సి .ఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించే పింక్ రీమేక్ కి పవన్ కళ్యాణ్ ఓకే చెపినట్లు పూర్తి సమాచారం ఉంది. పవన్ కళ్యాణ్ సినీ చరిత్ర ముగిసిపోయిందని మనం అనుకుంటే పొరపాటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచి సామజిక, ఇంకా ప్రజల్లో చైతన్యం కలిగించే సినిమాలను చేయడానికి సిద్ధంగా ఉన్నారని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. పింక్ రీమేక్ ని దిల్ రాజు మరియు బోనీ కపూర్ కలిసి తెరపైకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నట్లు సమాచారం. 


ఒరిజినల్ పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ హీరో గా నటించారు. లాయర్ పాత్రని పోషించిన అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక రేప్ కేసు పై వాదిస్తారు.  అజిత్ నటించిన పింక్ సినిమా రీమేక్ ఇప్పటికే తమిళంలో చాలా పెద్ద హిట్ అయింది. అనిరుద్ రోయ్ చౌదరి తీసిన పింక్ సినిమా 64వ నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ ఫిల్మ్ అవార్డుని సొంతం చేసుకుంది. మంచి కథతో వస్తున్న ఈ పింక్ రీమేక్ తెలుగు లో కూడా బాగా హిట్ అవుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: