ఈ ఇయర్ సంక్రాంతికి ఎఫ్-2 అంటూ వచ్చి సంచలన విజయం అందుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం బాబి డైరక్షన్ లో వెంకీమామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా నటిస్తున్నాడని తెలిసిందే. పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో ఉన్నారు. 


దసరాకి టీజర్ తో సర్ ప్రైజ్ చేసిన వెంకీమామ సినిమా ఆ టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేల చేసుకున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో పెద్ద కన్ ఫ్యూజన్ మొదలైంది. అసలైతే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మూవీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని అది కాస్త 2020 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయినట్టు వార్తలు వచ్చాయి.


సంక్రాంతి బరిలో మహేష్, అల్లు అర్జున్ సినిమాల మధ్య టఫ్ ఫైట్ జరుగనుంది. అయితే ఈ రెండిటి మధ్య వచ్చి హిట్ కొట్టడం అంత తేలికైన విషయం కాదు అందుకే వెంకీమామ నిర్మాత సురేష్ బాబు సినిమాను సంక్రాంతికి కాకుండా ముందే రిలీజ్ చేస్తున్నారట. డిసెంబర్ 13న వెంకీమామ సినిమా రిలీజ్ ఫిక్స్ చేస్తున్నారట. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.


డిసెంబర్ 20న సాయి తేజ్ ప్రతిరోజు పండుగే, బాలకృష్ణ రూలర్ సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. క్రిస్ మస్ సీజన్ లో రెండు సినిమాలు పోటీ ఓకే కాని మూడో సినిమా వస్తే మాత్రం కొద్దిగా కష్టమే. అందుకే వెంకీమామ క్రిస్ మస్ రేసులో కూడా వద్దని అనుకున్నారు. అందుకే క్రిస్ మస్ కు రెండు వారాల ముందు రిలీజ్ ప్లాన్ చేశారు. చూస్తూ చూస్తూనే సినిమాకు భారీ బడ్జెట్ పెట్టేశారట్. మరి సోలోగా రిలీజైతేనే కాని అవి రికవర్ అయ్యే ఛాన్స్ ఉందని అలా చేస్తున్నారట. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: