టాలీవుడ్ ప్రిన్స మహేశ్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరుతో బిజీగా ఉన్నాడు. 2020 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటోంది. మహేశ్ సినిమా షూటింగ్స్ తో పాటు ఫ్యామిలీకి కూడా టైమ్ కేటాయిస్తాడన్న విషయం తెలిసిందే. ఓ సినిమా షూటింగ్ అయ్యాక ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్తేనే మహేశ్ కు హ్యాపీగా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మహేశ్ మళ్లీ కొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాడని టాక్.

 


ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరుతో బిజీగా ఉన్న మహేశ్సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే ఓ మూడు నెలలు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేయనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ విషయాన్ని నమ్రతే చెప్పుకొచ్చిందని అంటున్నారు. మహర్షి రెస్ట్ లెస్ గా పనిచేస్తున్న మహేశ్ కొంత సమయం పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. మొన్నీమధ్యే ఫ్యామిలతో వెకేషన్ కు వెళ్లిన మహేశ్ ఈసారి హైదరాబాద్ లోనే టైమ్ స్పెండ్ చేయనున్నాడని అంటున్నారు. మహేశ్ కు సినిమాలు ఎంత ముఖ్యమో ఫ్యామిలీ టైమ్ కూడా అంతే ముఖ్యం. ప్రొఫెషనల్ లైఫ్ ను పర్సనల్ లైఫ్ ను వేరు చేసి చూడడంలో మహేశ్  పర్ఫెక్ట్. ఈ మూడు నెలల గ్యాప్ తర్వాత కొత్త సినిమా మొదలుపెడతాడని అంటున్నారు.

 


తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇదే బిజీతో గతంలో ఫ్యామిలీతో స్పెండ్ చేసింది తక్కువ అని మహేశ్ చాలాసార్లు చెప్పాడు. అప్పట్లో తాను తండ్రిని మిస్ అయిన బాధ తన పిల్లలకు ఉండకూడదనే గౌతమ్, సితారలకు ఎక్కువ టైమ్ కేటాయిస్తూంటాడు. వెకేషన్స్ కు తీసుకెళ్తూ పర్ఫెక్ట్ కేరింగ్ తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే సరిలేరు.. పూర్తవ్వగానే మూడు నెలలు గ్యాప్ తీసుకుంటున్నట్టు వినికిడి.


మరింత సమాచారం తెలుసుకోండి: