గత ఏడాది బాలీవుడ్ స్టార్స్ కు మీటూ దెబ్బ గట్టిగా తలిగిలిన సంగతి తెలిసిందే. ఎంతో మంది ప్రముఖులకు మీటూ ఎఫెక్ట్ బాగా పడింది. వీళ్ళలో ప్రముఖ స్టార్స్ విమర్శల పాలయ్యారు కూడా. మీటూ అంటూ ఎంతో మంది లేడీ సెలబ్రెటీలు గతంలో తమకు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని చెప్పుకున్నారు. ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్ పై ఎంతో మంది సింగర్స్ ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి కూడా. ఇలాంటి సమయంలో మరో ప్రముఖ సింగర్ శ్వేతా పండిట్ కూడా అను మాలిక్ పై సంచలన ఆరోపణలు చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది కూడా. 

15 ఏళ్ల వయసులోనే శ్వేతా పండిట్ సింగర్ గా అవకాశాల కోసం చాలామంది సంగీత దర్శకుల దగ్గరకు వెళ్లిందట. ఆ సమయంలోనే అను మాలిక్ దగ్గరకు నేను వెళ్లాను అని.. ఆ సమయంలో ఆయన నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆరోపించింది. చిన్న పిల్లనని కూడా చూడకుండా నన్ను లైంగికంగా వేదించాలని చూశాడు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అను.. తన దగ్గర అవకాశం ఇవ్వడానికి చాలా కండీషన్స్ పెట్టాడని శ్వేతా వాపోయింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత శ్వేతా పండిట్ ఈ విషయాన్ని బయటకు వెళ్లడించడంతో పెద్ద చర్చ అవుతోంది. కొందరు నెటిజన్స్ శ్వేతాకు సపోర్ట్ చేస్తుంటే కొందరు మాత్రం ఇంత కాలం ఏం చేశారంటూ రివర్స్ లో కౌంటర్స్ వేస్తున్నారు. 

అయితే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. కాని అప్పుడే అను చెంప పగులకొట్టి ఉంటే బాగుండేది కదా.. అలా చెస్తే కెరీర్ నాశనం అవుతుందని అనుకున్నారా అంటూ ప్రశ్నించాడు. ఆ కామెంట్స్ కు స్పందించిన శ్వేతాపండిట్ నేను సింగర్ గా 20 ఏళ్ల నుండి కొనసాగుతున్నాను. ఇప్పుడు నేను ఆ విషయాన్ని చెప్తేనే చాలా మంది నన్ను తిడుతున్నారు. అలాంటిది అప్పుడే నేను ఆ విషయాన్ని చెప్తే ఏం జరిగి ఉండేదో నేను అర్థం చేసుకోగలను అంటూ సమాధానం చెప్పింది. ఇక శ్వేతాపండిట్ మీటూ ఆరోపణలతో అనుమాలిక్ కి ఇంకా గట్టి షాక్ తగిలింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: