విద్యాబాలన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో బసవతారకంగా ఎంతో పాపులర్. ఎన్టీఆర్ బయోపిక్ తో తెలుగు వాళ్ళకి ఎంతో సుపరిచితమైన విద్యాబాలన్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు అంటే క్షణం తీరిక లేనంత బిజీ స్టార్ గా కెరీర్ పరంగా ఫుల్ ఫాం లో ఉన్నారనే చెప్పాలి. 2005లో పరిణీత సినిమా తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన విద్యాబాలన్ ఆ సినిమా ఫర్వాలేదనిపించడంతో సంజయ్‌దత్ సరసన లగే రహో మున్నాభాయ్‌లో జాహ్నవిగా నటించింది. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు కెరీర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్టార్ ఇమేజ్ కోసం పాకులాడకుండా డర్టీ పిక్చర్, బేగం జాన్..వంటి ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించింది.  

డర్టీ పిక్చర్.. కహానీ.. మిషన్ మంగళ్.. ఎన్టీఆర్ బయోపిక్.. ఇలా వరుసగా ఎన్నో విలక్షణమైన సినిమాల్ని ఎంపిక చేసుకుని నటించిన బాలన్ ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రతో ఎంటర్ టైన్ చేయనున్నారని తాజా సమాచారం. దీదీ మాయావతి బయోపిక్ తో ట్రీటిచ్చేందుకు విద్యాబాలన్ సిద్ధమవుతోందని బాలీవుడ్ మీడియా సమాచారం. అలాగే ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి బయోపిక్ లోనూ విద్యా బాలన్ ప్రస్తుతం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ సాన్యా మల్హోత్రా బాలన్ కు కూతురుగా నటిస్తోంది. 

తాజాగా బాలన్ ఓ హాట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇది శకుంతలాదేవి బయోపిక్ నుంచా కాదా అన్నది మాత్రం క్లారిటి లేదు. అయితే.. ఇందులో క్లీవేజ్ షో యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. కంచి పట్టు చీరలో ఎంతో పద్ధతిగా ఉన్న విద్యా మరీ ఇంత వేడిగా క్లీవేజ్ ని ప్రదర్శించడమేమిటో అంటూ కామెంట్లు పడుతున్నాయి. అయితే బోల్డ్ అండ్ బ్యూటీగా పేరున్న బాలన్ కి ఇలాంటి షోలు కొత్త కాదు. ప్రతిసారీ తన బోల్డ్ యాటిట్యూడ్ తో జనాలకి షాక్ లు ఇస్తూనే ఉంది. ఇటీవలే తమిళ ఇండస్ట్రీలో తనకు ఎదురైన వేధింపుల వ్యవహారాన్ని.. చేదు అనుభవాన్ని విడమర్చి చెప్పి పెద్ద షాక్ కి గురి చేసింది. డర్టీ పిక్చర్ లో సిల్క్ స్మితను మించిన బోల్డ్ యాటిట్యూడ్ తో జనాల గుండెలని పిండేసిన సంగతి మర్చిపోలేరు. 


మరింత సమాచారం తెలుసుకోండి: