డి.ఎస్.పి...దేవీ శ్రీ ప్రసాద్ అంటే ఒక ఎనర్జీ. అతను ఇచ్చే సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక స్టార్ హీరో సినిమా మీద ఎంత క్రేజ్ ఉంటుందో దేవీ మ్యూజిక్ ఇచ్చే సినిమా మీద..దేవీ మీద అంతగా క్రేజ్ ఉంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. అయితే కొన్ని రోజుల క్రితం వరకు సరిలేరు నీకెవ్వరు లో ఐటెం సాంగ్ గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. తమన్నా ఈ ఐటెం సాంగ్ ను చేయబోతుందని దేవిశ్రీ ప్రసాద్ తనదైన శైలిలో ఐటెం సాంగ్ కోసం మాంచి మాస్ మసాలా ట్యూన్ ను రెడీ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఈ ఐటెం సాంగ్ విషయమలో మీడియాలో వచ్చిన వార్తలు అన్ని పుకార్లే అని ఆ తర్వాత తేలిపోయింది. అసలు సరిలేరు నీకెవ్వరు లో ఐటెం సాంగ్ లేదంటు చిత్ర యూనిట్ ద్వారా ఒక ప్రకటన వచ్చింది. 

ఐటెం సాంగ్ లేని లోటును దేవిశ్రీ ప్రసాద్ భర్తీ చేసేలా మాస్ సాంగ్ ను ట్యూన్ చేసినట్లుగా నిర్మాత అనీల్ సుంకర క్లారిటి ఇచ్చాడు. ఆయన ట్విట్టర్ లో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మాస్ సాంగ్ విన్న తర్వాత కేక అనే పదం చిన్నది అవుతుందనిపిస్తుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఈ మాస్ సాంగ్ మంచి ట్రీట్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ సాంగ్ తో సినిమా క్రేజ్ మరింతగా పెరుగుతుందంటూ చిత్ర యూనిట్ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు.

కమర్షియల్ సినిమా.. అందులోను దేవీ శ్రీ-మహేష్ కాంబో అంటే ఐటెం సాంగ్ తప్పకుండా ఉంటుందని అందరు డిసైడై ఉన్నారు. అయితే సరిలేరు నీకెవ్వరు లో ఐటెం సాంగ్ లేదు కాబట్టే ఆ మాస్ సాంగ్ తో ఐటెం సాంగ్ లేని లోటును భర్తీ చేస్తారేమోనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా దేవీ శ్రీ ఒకరకంగా దెబ్బేసాడని కొందరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇపటికే 'అల' నుంచి వచ్చిన రెండు పాటలు జనాలని మెస్మరైజ్ చేస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: