ఏ హీరోకైనా అభిమానులే బలం మరియు కొండంత అండ అని చెప్పాలి. ఇక ఆయా హీరోలు కూడా తమ అభిమానులను ఎంతో ప్రాణంగా భవిస్తూ ఉంటారు. ఇక మన తెలుగు హీరోలు అయితే అభిమానులను తమ కుటుంబం గానే భావిస్తూ వారికోసం తమ వంతుగా సాయం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎంతో గొప్ప పేరు సంపాదించిన సూపర్ స్టార్ కృష్ణ గారి గొప్పతనం గురించి, అలానే ఆయన తన ఫ్యాన్స్ ను ఎంతో ఆదరిస్తారు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ఇకపోతే ఆయన తనయుడైన సూపర్ స్టార్ మహేష్ గారు కూడా అభిమానులను తన ప్రాణంగా భావిస్తుంటారు. ఇక నేడు తన అభిమాన గణంలోని రాము అనే అభిమాని హఠాత్తుగా డెంగ్యూ వ్యాధి బారిన పడి మరణించిన విషయం తెలుసుకుని ఆయన ఎంతో కలత చెందినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం తన అభిమాన సూపర్ స్టార్ తో కలిసి రాము, ఎంతో ఆప్యాయంగా ప్రేమతో ఒక ఫోటో కూడా దిగాడని, అయితే నేడు హఠాత్తుగా అతడు మనల్ని అందరినీ విడిచి వెళ్లిపోవడం నిజంగా బాధాకరమని మహేష్ బాబు సోషల్ మీడియా టీమ్ అతడికి నివాళిని ప్రకటిస్తూ ఒక ట్వీట్ పోస్ట్ చేసింది. 

మహేష్ గారు కూడా ఈ విషయమై ఎంతో బాధపడ్డట్లు మహేష్ టీమ్ తెలిపింది. కావున ఇకపై అభిమానులందరూ కూడా తమ ఆరోగ్య విషయమై ఎంతో శ్రద్ధ వహించి, తమ తమ కుటుంబాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లు మహేష్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తుండగా, ఆ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: