టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్.  మొదటి సినిమా రేయ్ అయినప్పటికీ పిల్లా నువ్వులేని జీవితం సినిమా రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది..అంతే కాదు ఈ మూవీలో మెగా ఫ్యాన్స్ కావాల్సి డ్యాన్స్, ఫైట్స్ , కామెడీతో బాగా అలరించాడు సాయిధరమ్ తేజ్.  ఆ తర్వాత రిలీజ్ అయిన ‘సుబ్రమాణ్యం ఫర్ సేల్’ తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు.  ఆ తర్వాత రాశీఖన్నా హీరోయిన్ గా సుప్రీమ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సుప్రీమ్ లో రాశీఖన్నా-సాయిధరమ్ జంట కు మంచి పేరు వచ్చింది. 


తర్వాత సాయిధరమ్ తేజ్ కి బ్యాడ్ టైమ్ మొదలైంది.  వరుసగా ఆరు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.  ఈ ఏడాది చిత్రలహరి మూవీతో కాస్త పరవాలేదు అనిపించుకున్నాడు.  తాజాగా సాయిధరమ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా 'ప్రతీరోజూ పండగే' సినిమా రూపొందుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఈ మద్య రిలీజ్ అయ్యింది. మీణ నేపథ్యంలో .. బంధాలు - అనుబంధాలు చుట్టూ అల్లుకున్న అందమైన కథ ఇది. ఈతరహా సినిమాలకు తెలుగు లో మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. 


యూవీ క్రియేషన్స్ .. గీతా ఆర్ట్స్ 2 వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో తేజు వున్నాడు. ఇక దర్శకుడు మారుతికి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమే. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: