పవన్ కళ్యాణ్ ‘పింక్’
రీమేక్ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని స్వయంగా
తరుణ్ ఆదర్శ్ ట్విట్ చేసినా ఆ ట్విట్ ఏమాత్రం
పవన్ అభిమానులకు జోష్ ను ఇవ్వలేకపోయింది అన్నవార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ మళ్లీ సినిమాల్లోకి రావడం అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే అయినా రీఎంట్రీకి ఆయన ఎంచుకున్న
సినిమా విషయంలో
పవన్ అభిమానులు పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారు అన్న లీకులు వస్తున్నాయి.
అంతేకాదు
పవన్ ను వేరే సబ్జెక్ట్ ఎంచుకోమని ‘పింక్’
రీమేక్ వద్దు అంటూ
పవన్ కు వేల సంఖ్యలో అతడి వీరాభిమానులు మెసేజెస్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ నాయకుడిగా మారిన
పవన్ ఆలోచనలకు ఈకథ సరిపోయేదికాదనీ అభిమానులు ఇలాంటి కథలో పవన్ను చూడాలని కోరుకోరు అంటూ వారి మెసేజ్ లలో అభిప్రాయపడుతున్నట్లు టాక్.
ప్రస్తుతం సగటు ప్రేక్షకులు మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలను కోరుకుంటున్న నేపధ్యంలో ఈమూవీ అందరికీ కనెక్ట్ కాదు అని
పవన్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఈమూవీ కథకు భారీగా మార్పులు చేసి తమిళంలో టాప్
హీరో అజిత్ నటించినా అక్కడ ఆమూవీ సూపర్ హిట్ కాలేదు అన్న విషయాన్ని అభిమానులు
పవన్ దృష్టికి తీసుకు వస్తున్నారు.
అంతేకాదు గతంలో
పవన్ ‘ఓ మై గాడ్’ రీమేక్ ‘గోపాల గోపాల’ లో నటించినా ఆ
మూవీ సూపర్ హిట్ కాలేదు అన్న విషయం
పవన్ మరిచిపోయాడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో అన్ని భాషల సినిమాలను జనం చూసేస్తున్నారానీ ఇప్పటికే
హిందీ తమిళ భాషలలో పలువురు పలుసార్లు చూసిన ‘పింక్’
రీమేక్ కు ఏమంత క్రేజ్ ఉండదు అన్నది
పవన్ వీరాభిమానుల వాదన. దీనితో
పవన్ ‘పింక్’ రీమేక్ లో
పవన్ నటించడం వల్ల అతడి అభిమానుల్లో కూడ జోష్ కనిపించని పరిస్థితులలో
పవన్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అన్న విషయం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది..