బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కి నేడు శుభం కార్డు పడనుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుంది. ఈ ఎపిసోడ్ లో టైటిల్
విన్నర్ ఎవరో ప్రకటించనున్నారు. ప్రస్తుతం టైటిల్ రేస్ లో 5గురు కంటెస్టెంట్లు...
వరుణ్ సందేశ్ ,
బాబా భాస్కర్ ,
రాహుల్ ,
అలీ రెజా ,
శ్రీ ముఖి వున్నారు. వీరిలో అసలు పోటీ మాత్రం
రాహుల్ ,
వరుణ్ , శ్రీ ముఖిల మధ్య నే వుంది.
ఇక గత కొద్దీ రోజుల నుండి సోషల్
మీడియా లో రాహులే టైటిల్ విన్నరంటూ వార్తలు వస్తున్నాయి. అయితే సోషల్
మీడియా లో వచ్చే వార్తలను నమ్మొద్దని అంటున్నాడు షో వ్యాఖ్యాత కింగ్ నాగార్జున. లాస్ట్ డే షూటింగ్ లో పాల్గొంటున్నాను. ఈప్రయాణం అద్భుతం సాగింది . బిగ్ బాస్ టైటిల్
విన్నర్ గురించి వచ్చే స్క్రోల్స్ కానీ సోషల్
మీడియా లో వచ్చే వార్తలు గాని నమ్మకండి.
విన్నర్ ఎవరో తెలియాలంటే సాయంత్రం
స్టార్ మా లో ప్రసారం కానున్న ఎపిసోడ్ చూడండి అంటూ కొద్దీ సేపటి క్రితం నాగ్ ట్వీట్ చేశాడు.
ఇక 15 మంది కంటెస్టెంట్ల తో మొదలైన ఈ సీజన్ ..మొదట మంచి రేటింగ్స్ నే రాబట్టుకున్న తరువాత ఇంట్రెస్టింగ్ గాని లేని టాస్క్ లతో చప్పగా సాగింది. అయితే మధ్యలో
రాహుల్ - పునర్నవి
లవ్ ట్రాక్ షో ను గట్టెక్కించింది. ఈరోజు విజేత ఎవరో తెలిసిపోతుంది కాబట్టి ఈ ఫైనల్ ఎపిపోడ్ కూడా భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి బిగ్ బాస్ తెలుగు 3 టైటిల్ ను ఎవరు ఎగరేసుకుపోతారో చూడాలి.