ఒక సినిమా విడుదల అయ్యాక ఆ సినిమా టాక్ విషయంలో అదేవిధంగా కలెక్షన్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాకుండానే ఆ మూవీని నిర్మించిన దర్శక నిర్మాతలు మీడియా మీట్ పెట్టి అతిగా మాట్లాడటం ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారింది. ఇప్పుడు ఇదే పద్ధతిని అనుసరిస్తూ హీరో నుండి నిర్మాతగా మరినా విజయ్ దేవరకొండ కూడా తాను నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీ మీడియా మీట్ లో చేసిన ఓవర్ ఆక్షన్ చూసి మీడియా వర్గాలు షాక్ అయ్యాయి అన్న వార్తలు వస్తున్నాయి.  

నిన్న ఈ మూవీ  సక్సస్ మీట్ పెట్టారు. ఎప్పటిలాగే విజయ్ తన సహాజ సిద్దమైన అతిని తన ఇగోని మళ్ళీ మరోసారి బయట పెట్టాడు. తనకు ఫుల్ జ్వరం అని లేదంటే షామ్పైన్ బాటిల్ పొంగేదని అంటూ తన స్పీచ్ ని మధ్యలో ఆపి ఒక  పెరాసిటమాల్ టాబ్లెట్ తెమ్మని చెప్పి ఆ వేదిక పై వేసుకొని వాటర్ తాగడం చూసి మీడియా వర్గాలు షాక్ అయ్యాయి అన్న వార్తలు వస్తున్నాయి.   

జ్వరం ఉన్నప్పుడు ఉన్నపళంగా ప్రెస్ మీట్ పెట్టడం అవసరమా అంటూ కామెంట్ రావడమే కాకుండా వేదికపై అందరి మధ్య ఈ టాబ్లెట్ హడావిడి ఏమిటి అంటూ ఆ మీడియా మీట్ కు వచ్చిన చాలమంది జోక్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా అవసరమా అన్నది విజయ్ కి తెలియాలి అంటూ మరికొందరు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. 

అంతేకాదు ఇదే  ప్రెస్ మీట్ లో తను నిర్మాతగా సేఫ్ అనిచెప్పడమే కాకుండా ఈమూవీని చూస్తున్న ప్రేక్షకులు కడుపునొప్పి వచ్చేంతలా   నవ్వుతున్నారని విజయ్ వరస పెట్టి గొప్పలు చెప్పడంతో విజయ్ దేవరకొండకి హీరో లక్షణాలతో పాటు నిర్మాత లక్షణాలు కూడ బాగా వచ్చేసాయి అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.  ఈమూవీకి పాజిటివ్  టాక్ వచ్చినా ఈ మూవీ కలెక్షన్స్ పరిస్థితి మాత్రం ఈ వీక్ ఎండ్ తరువాత వచ్చే మొదటి సోమవారం రేపు మాత్రమే తెలుస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: