పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని అమితంగా ఆకర్షించింది. ఈ సినిమాతో స్టార్ట్ అయిన విజయ్ దేవరకొండ కెరీర్ అతి కొద్ది రోజుల్లోనే సూపర్ స్టార్ స్థాయికి ఎదిగాడు. అయితె విజయ్ తనకి హిట్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తూ "మీకు మాత్రమే చెప్తా" అనే సినిమా తీశాడు. 


కింగ్ ఆఫ్ హిల్ ప్రొడక్షన్ బ్యానర్ విజయ్ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఫుల్ కామెడీతో ప్రేక్షకులని బాగానే అలరిస్తుందని టాక్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మీకు మాత్రమే చెప్తా టీమ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. అందరూ కొత్త వాళ్లతో చేసిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. 


పెళ్ళి చూపులు సినిమాతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న తరుణ్, ఈ సినిమాతో హీరోగా సెటిల్ అయిపోవచ్చని అంటున్నారు. పెళ్ళి చూపులు సినిమా తీసి తరుణ్ విజయ్ కి మంచి హిట్ ఇవ్వడంతో అతనికి బాకీ ఉన్నానని చెప్పిన విజయ్..ఈ సినిమా ద్వారా ఆ బాకీ తీర్చేసుకున్నాడని, అంతే కాదు ఈ సినిమాతో తరుణే విజయ్ కి రుణపడి ఉన్నాడని అంటున్నారు.


ఈ నేపథ్యంలో తరుణ్ ఆ రుణాన్ని ఏదో ఒకరోజు తీర్చుకుంటాడట. విజయ్ డైరెక్షన్ చేయాలని ఉందట. అయితే దీనికి తరుణ్ ప్రొడ్యూసర్ గా మారి విజయ్ చేత డైరెక్షన్ చేయిస్తానని అంటున్నాడు. మరి హీరో నుండి నిర్మాతగా మారి సక్సెస్ సాధించిన విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ నిర్మాణంలో దర్శకుడిగా మారతాడో లేదో చూద్దాం. ప్రస్తుతం మీకు మాత్రమే చెప్తా సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: