కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న చాలా సినిమాతో బిజీ గా ఉంది. గీత గోవిందం సినిమా తర్వాత ఆమెకి సినీ ఆఫర్స్ వద్దన్నా వెంటపడుతున్నాయి. డియర్ కామ్రేడ్ సినిమా లో కూడా తన అందాలతో, ముచ్చటైన నటనతో బాగా అలరించింది. ప్రస్తుతానికి ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ సినిమాలో నటిస్తున్న రష్మిక ఒక మీడియా ఇంటరాక్షన్ లో తన అలవాటును బయటపెట్టారు. 


రష్మిక మందన్న చాలా సినిమాలలో ఒకేసారి నటిస్తూ ఉండటం వలన ఏవరు ఎపుడు ఏ సినిమా సెట్స్ కి పిలుస్తారో ఉహించలేని పరిస్థతి. అందుకే తనతో ఎపుడూ సర్దిపెట్టి ఉన్న ఒక సూటుకేసు ఉంటుందని మీడియా సమావేశంలో చెపింది. అలాగే తను ఏదేనా సినిమా షూటింగ్ పూర్తిచేసినా, ఆ సినిమా విడుదలయ్యే వరకు దానిపైనే పూర్తి ధ్యాస ఉంటుందని చెప్పారు. తన సినిమాకి ప్రేక్షకులు స్పందన ఎలా ఉంటుందో అని ఆరాతీయడం బాగా అలవాటు అయిందని ఆమె చెప్పుకొచ్చారు. ఎలాగోలా సినిమా పూర్తిచేశాం, ఇక వాటితో నాకేం సంబందం లేదనుకుంటూ వదిలేయనని ఈ కన్నడ ముద్దుగుమ్మ వెల్లడించారు. 


చేతిలో చాలా సినిమాలు ఉన్నపటికీ బాగా పేరు సంపాదించినప్పటికీ అందరి లాగానే కొన్ని విషయాలలో తనకి బాధలు ఉన్నాయని చెబుతుంది. మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవరు' సినిమాలో రష్మిక నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12వ తారీకు విడుదలువుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంతో దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. 


రష్మిక మందన్న నితిన్ సరసన భీష్మ మూవీలో కూడా చేస్తున్నారు. ఈ రొమాంటిక్ సినిమా డిసెంబర్ 25వ రోజున విడుదల కానున్నది. వెంకీ కుడుముల దర్శకత్వంలో, నాగ వంశి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: