బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫైనల్ ఈరోజు సాయంత్రం ప్రసారంకానుంది. ఫైనల్ ఎపిసోడ్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. శనివారం ఎపిసోడ్ ఇంట్లోకి కంటెస్టంట్స్ అందరు రాగా హౌస్ మేట్స్ అంతా ఇంట్లో తమ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. అయితే అందరు కంటెస్టంట్స్ హ్యాపీగా ఉండగా ఒక్క మహేష్ విట్టా మాత్రం సైలెంట్ గా కనిపించాడు. అంతేకాదు ఇంట్లో సభ్యులందరు హ్యాపీ మూడ్ లో ఉంటే మహేష్ మాత్రం సీరియస్ గా కనిపించాడు. 

 

మహేష్ అలా ప్రవర్తించడానికి కారణం ఏంటన్నది ఆలోచిస్తే బయటకు వెళ్లిన మహేష్ తన ఆట తీరు చూసుకోవడంతో పాటుగా ఇంటి సభ్యులు తన మీద చెప్పిన అభిప్రాయాల వల్ల హర్ట్ అయ్యాడని తెలుస్తుంది. ఇక ఇంటి సభ్యుల రీ యూనియన్ లో అందరికి అవార్డు లు ఇచ్చారు. మహేష్ కు కూడా నారద అవార్డు ఇచ్చారు. మహేష్ దానికి కూడా హర్ట్ అయ్యాడని తెలుస్తుంది.

 

ఇంట్లో 80 రోజుల పాటు తన వంతు ఎంటర్టైన్మెంట్ కోసం ప్రయత్నించిన మహేష్ ఇలా సడన్ గా సీరియస్ గా కనిపించడం బిగ్ బాస్ గేమ్ ను మహేష్ ఇంకా అర్ధం చేసుకోలేదు అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. శనివారం ఇంట్లోకి వెళ్లిన మహేష్ బయట ఎవరెవరికి ఎంత క్రేజ్ ఉందో చెప్పినట్టు ఉన్నాడు.

 

దాదాపుగా అందరు అనుకున్నట్టే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్, శ్రీ ముఖిలలో ఒకరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే శ్రీ ముఖి విన్నర్ అని కొందరు..రాహుల్ విన్నర్ అని మరికొందరు సోషల్ మీడియాలో హుంగామా చేస్తున్నారు. హోస్ట్ నాగార్జున ఈ విషయంపై స్పందించి విన్నర్ ఎవరన్నది తెలుసుకోవాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయండి అని ట్వీట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: