మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'అలవైకుంఠపురంబులో' సినిమా త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకునీ రికార్డు కలెక్షన్లు బన్నీ కెరీర్లో సాధించాయి. ఇటువంటి నేపథ్యంలో వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురంలో సినిమాపై భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే వస్తున్న వార్తలు మరియు విడుదలైన పాటలు బట్టి సినిమాపై అంచనాలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోవడంతో అదేవిధంగా విడుదలైన రెండు సాంగ్స్ సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టిస్తున్న క్రమంలో అల వైకుంఠపురంలో సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని తెగ కామెంట్లు చేస్తున్నారు.


ముఖ్యంగా సామజ వర గమన అనే సాంగ్ యూట్యూబ్ లో తెలుగు సినిమా రంగంలో ఏ పాట చెయ్యని రికార్డులు సృష్టించి సినిమాకి మంచి వైపు తీసుకు రావడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నటువంటి సామజవరగమన సాంగ్ ని అల్లు అర్జున్ కోసమని ప్రముఖ తెలుగు సింగర్ మనీష ఈరబత్తిని కొత్తగా పాడి, యూట్యూబ్ లో విడుదల చేసింది.ఇకపోతే మనీష పాట చూసిన నెటిజన్లు, అభిమానులు అందరు కూడా మనీష పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


కాగా సినిమా ప్రమోషన్ కోసమని ఒక సింగర్ ఇలా పాడటం అనేది చాలా ఆనందంగా ఉందని అల్లు అర్జున్ కూడా తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారని ఫిలింనగర్ లో టాక్. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా జనవరి 12వ తారీకున మెగా అభిమానులను పలకరించడానికి సిద్ధమైంది. ముఖ్యంగా ఈ సినిమాలో టబు మరియు అదే విధంగా అక్కినేని సుశాంత్ నటించడంతో సినిమాపై ఇండస్ట్రీలో కూడా అంచనాలు నెలకొన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: