ప్రస్తుతం
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న క్రేజీ షో
బిగ్ బాస్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. మొదటి రెండు సీజన్స్ కు
టాలీవుడ్ యంగ్ టైగర్ మరియు నాచురల్ స్టార్
నాని హోస్టులుగా వ్యవహరించగా, ప్రస్తుతం సాగుతున్న ఈ మూడవ సీజన్ కు
నాగార్జున గారు హోస్టుగా వ్యవహరిస్తూ షోను మరింత జోష్ తో ముందుకు తీసుకెళ్తున్నారు అనే చెప్పాలి. అయితే ఆమధ్య ఒకింత చప్పగా సాగిన ఈ షో, ఇటీవల కొద్దిరోజులుగా మంచి రసవత్తరంగా సాగుతోంది. ఇక నేడు జరుగనున్న
బిగ్ బాస్ ఈ సీజన్ ఫైనల్ షోలో భాగంగా ప్రస్తుతం షోలో మిగిలిన
శ్రీముఖి,
రాహుల్,
బాబా భాస్కర్,
ఆలీ,
వరుణ్ సందేశ్ లలో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయమై సర్వత్రా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఇక మరోవైపు పలు సోషల్
మీడియా మాధ్యమాల్లో ఫలానా వారే
విజేత అంటూ పేర్లు కూడా ప్రచారం అవుతున్నాయి. అయితే అటువంటి వదంతులేవి కూడా నమ్మవద్దని
కింగ్ నాగార్జున గారు నేటి ఉదయం తన సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేస్తూ తెల్పడం జరిగింది. ఇకపోతే నేడు ఎంతో గ్రాండ్ గా జరుగనున్న ఈ ఫైనల్ షోకు పలువురు
సినిమా నటులు ప్రత్యేకంగా రానున్నట్లు తెలుస్తోంది.
కొన్ని కొన్ని ఫిలిం
నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, నేటి షోకు
యువ నటి
నిధి అగర్వాల్, సీనియర్
హీరో శ్రీకాంత్, అలానే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న మెగా సుప్రీమ్
హీరో సాయిధరమ్ హీరోగా నటిస్తున్న ప్రతిరోజు పండగే
సినిమా యూనిట్ కూడా హాజరుకాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తే కనుక నిజం అయితే, నేడు ఈ ఫైనల్ షో చూసే ప్రేక్షకుల కనులకు వీనుల విందు ఖాయం అనే అర్ధం అవుతోంది. మరి కొద్ది గంటల్లో
బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి మరి......!!