ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు జాతి గర్వించదగిన గాయకుడు.  మహాత్మ గాంధీ 150 జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సినీ ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 29న జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు పలువురు సౌత్‌ సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే సౌత్‌లో అగ్రతారలకు ఆహ్వానాలు అందకపోవటంతో, కార్యక్రమంలో పాల్గొన్న కొద్ది మంది దక్షిణాది సినీ ప్రముఖుల ఫోటోలు కూడా బయటకు రాకపోవటంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేశారు.


మెగా కోడలు, రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన ట్విటర్‌ వేదికగానే మోదీ తీరుపై విమర్శలు కురిపించారు. దక్షిణాది నటులను ఆహ్వానించకపోవటం ఎంతో బాధించింది అని  ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ మీట్‌పై మరో సౌత్‌ లెజెండ్ స్పందించారు. మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సౌత్‌ ను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం హాజరయ్యారు.


ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్ చేసిన ఆయన ఆనందంతో పాటు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. `రామోజీరావుగారి కారణంగా మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. కార్యక్రమానికి హాజరైన మమ్మల్ని ఎంట్రన్స్‌ దగ్గర మా ఫోన్లు సెక్యూరిటీ వారికి అప్పగించి వెళ్లాలని కోరారు.


ఫోన్లు తీసుకొని మాకు టోకెన్లు కూడా ఇచ్చారు. కానీ లోపలికి వెళ్లే సరికి స్టార్స్‌ మోదీతో తమ సెల్‌ఫోన్లలో సెల్పీలు దిగుతున్నారు.ఈ సంఘటన నిరుత్సాహానికి గురిచేసింది` అంటూ సోషల్‌ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలీవుడ్ సినీ తారలు షారూఖ్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌లతో పాటు హీరోయిన్లు కూడా పాల్గొన్నారు. సౌత్‌ నుంచి దిల్‌ రాజుతో పాటు ఎస్పీబీలు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: