అక్కినేని
నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న
బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరగనుంది. ఇందులో టైటిల్
విన్నర్ ఎవరనేది అనౌన్స్ చేస్తారు. అయితే ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ సెలబ్రెటీలందరూ కదలి వస్తున్నారు. వారి అందచందాలతో స్టేజ్ను ఓ ఊపుఊపేందుకు అందాల తారలందరూ రెఢీ అవుతున్నారు. సినీ తారలు
అంజలి, క్యాథరిన్,
రాశి ఖన్నా గ్రాండ్ ఫినాలేకు విచ్చేసి సందడి చేయనున్నారు. రాశిఖన్నా ఏకంగా బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టి ఇంటి సభ్యులకు సర్ప్రైజ్ ఇచ్చింది. అనంతరం హౌస్మేట్స్తో కలిసి స్టెప్పులేసింది. ఇస్మార్ట్ హీరోయిన్
నిధి అగర్వాల్ డాన్సులు, అనురాగ్ కులకర్ణి పాడిన 'రాములో రాములా..' పాటతో స్టేజీ హోరెత్తిపోతున్నట్లు కనిపిస్తోంది. దీంతో నేటి ఎపిసోడ్ టన్నుల కొద్దీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది.
హీరో శ్రీకాంత్ తనకు పునర్నవి ఇష్టమైన కంటెస్టెంట్ అని చెప్పడంతో ఆమె ఆనందానికి హద్దులు లేవు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి ఫైనల్ ఎపిసోడ్కు తారలతోపాటు వారి వారి కుటుంబ సభ్యులు కూడా విచ్చేశారు. ఇక బిగ్బాస్ను ఇంటికి రమ్మన్న క్రేజీ బామ్మ ఈ ప్రోగ్రామ్లో హైలెట్గా నిలుస్తోంది. ఆమె మాటలకు పొంగిపోయి
నాగార్జున బామ్మకు లవ్యూ చెప్పాడు. వచ్చిన సెలబ్రిటీలు టాప్ 5 కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేయనున్నారు. చివరగా మిగిలే ఇద్దరిలో
విజేత ఎవరనేది ప్రత్యేక అతిథి ప్రకటిస్తాడు. ఆ స్పెషల్ గెస్ట్ మెగాస్టార్
చిరంజీవి అని టాక్ వినిపిస్తోంది. ఇక ఇంటి సభ్యులను ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యతను నాగ్..
అంజలి,
రాశి ఖన్నాకు అప్పగించాడు. మరి ఈ ఇద్దరు హీరోయిన్లు ఎవర్ని ఎలిమినేట్ చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. మొదటగా ఇంటి నుంచి
అలీ ఎలిమినేట్ అయ్యాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇకపోతే చివరిగా మిగిలేది బిగ్బాస్ విన్నర్గా శ్రీముఖి ఉండనుందని కొందరి అభిప్రాయం మరి ఏంజరుగుతుంది. ఏ పేరును వారిద్దరూ నిర్ణయిస్తారు అన్నది అంతటి ఉత్కంఠ నెలకొంది. ఈ షో ను ఫాలో అయ్యే ప్రతి ప్రేక్షకుడి దృష్టి ప్రస్తుతం టైటిల్ విన్నర్ కోసం చాలా ఆందోళనగా ఎదురు చూస్తున్నారు.