కోడి రామకృష్ణ డైరక్షన్ లో స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో వచ్చి సెన్సెషనల్ హిట్ ఇచ్చిన సినిమా అరుంధతి. శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా తర్వాత అనుష్క రేంజ్ మారిపోయింది. అప్పటివరకు కమర్షియల్ సినిమాలకు మాత్రమే చేసిన అనుష్క అరుంధతి తర్వాత లెక్క మారింది.


కమర్షియల్ గా కూడా సినిమా అదిరిపోయే హిట్ అందుకుంది. సౌత్ లో మిగతా భాషల్లో కూడా ఈ సినిమా డబ్ అయ్యింది. లేటెస్ట్ గా అరుంధతి సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది.


అయితే అరుంధతి రీమేక్ లో కరీనా కపూర్, అనుష్క శర్మ నటిస్తున్నారని తెలుస్తుండగా ఇప్పుడు ఆ లిస్ట్ లో దీపికా పదుకొనే కూడా చేరింది. బాలీవుడ్ క్రేజీ బ్యూటీగా దీపికా పదుకొనె క్రేజీ సినిమాలు చేస్తుంది. ప్రయోగాలను చేసేందుకు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించే దీపికా పదుకొనె అరుంధతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. 


ప్రస్తుతం దీపిక యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవిత కథతో వస్తున్న చఫాక్ సినిమా చేస్తుంది. దీనితో పాటుగా కపిల్ దేవ్ జీవిత కథతో తెరకెక్కే 83 సినిమాలో కూడా రణవీర్ సింగ్ కు జోడీగా నటిస్తుంది అమ్మడు. మహాభారతం నేపథ్యంతో తెరకెక్కే సినిమాలో ద్రౌపది పాత్రలో కూడా దీపికా నటిస్తుందని ముంబై మీడియా టాక్. ఇప్పటికే బాలీవుడ్ లో మిగతా హీరోయిన్స్ ఎవరు టచ్ చేయని ఎన్నో సినిమాలను చేస్తూ అలరిస్తున్న దీపికా. అరుంధతి జేజెమ్మ పాత్రలో నటిస్తే మాత్రం ఆ రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.   
 



మరింత సమాచారం తెలుసుకోండి: