టాలీవుడ్ సినిమా పరిశ్రమకు వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన చమ్మక్ చల్లో  సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది క్యాథరీన్ థెరిసా. అయితే తొలి సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ హీరోయిన్ గా తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది క్యాథరీన్. ఇక ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన పైసా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది కేథరిన్, అయినప్పటికీ ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇటీవల బన్నీ సరసన సరైనోడు అనే సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంది కేథరిన్. 

ప్రస్తుతం యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తున్న క్యాథరీన్, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వదలడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కాగా తన సినీ మరియు వ్యక్తిగత విశేషాల గురించి నిన్న ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, కొన్ని సంచలన విషయాలను బయటపెట్టడం జరిగింది. నిజానికి తనకు అందరిలానే పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో హాయిగా సుఖవంతమైన జీవితం గడపాలని ఉంటుందని, అయితే తనకు చిన్నప్పటి నుంచి వాసనను గ్రహించలేని ఒక వింత వ్యాధి ఉందని, దానివలన తను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని, అలానే ఆ వ్యాధి సోకిన నేను నా జీవిత భాగస్వామిని ఇబ్బంది పెట్టడం సరైనది కాదని భావించి, 

జీవితంలో పెళ్లి మరియు పిల్లలు అనేది తలుచుకో కూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఈ విషయం చాలామందికి తెలియదని, కేవలం తన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులకు మాత్రమే తెలుసని తెలిపింది కేథరిన్. ఇక ఆమె వ్యాధి విషయం తెలుసుకున్న పలువురు నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని, అలానే ఆమె ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ వార్త ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: