సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే ఎప్పటినుంచో ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడైన అశోక్ డెబ్యూ సినిమాకు గతంలో ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా మొదట్లోనే ఆగిపోయింది. దిల్ రాజు నిర్మాణంలో 'ఆడు మగాడ్రా బుజ్జి' ఫేమ్ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాల్సింది. కానీ ఆ సినిమా ఆగిపోవడంతో తర్వాత అశోక్ డెబ్యూ గురించి వార్తలేమీ రాలేదు. అయితే అదే కథ ని యంగ్ హీరో రాజ్ తరుణ్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇద్దరి లోకం ఒకటే అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే రాజ్ తరుణ్ కి జంటగా నటిస్తోంది. 

ఇక తాజా సమాచారం ప్రకారం అశోక్ గల్లా కు కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని లేటెస్ట్ న్యూస్. 'భలే మంచి రోజు'.. 'శమంతకమణి'.. 'దేవదాస్' సినిమాలను రూపొందించిన శ్రీరామ్ ఆదిత్య ఈ డెబ్యూ హీరో సినిమాకు దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో అశోక్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ను ఎంపిక చేశారట. ఈ సినిమాను నవంబర్ 10 వ తారీఖున లాంచ్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయని ఫిల్మ్ నగర్ సమాచారం.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో నటులకు కొదవేమీ లేదు. ఈ జెనరేషన్లో మహేష్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు.  మరోవైపు మహేష్ బావ సుధీర్ బాబు కూడా హీరోగా తన సత్తా చాటుతున్నారు. ఈ ఇద్దరి లాగానే మహేష్ మేనల్లుడు అశోక్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి.  ఇక అశోక్ కూడా నటనలో శిక్షణ తీసుకున్నట్లు ఇంతకముందే చెప్పుకున్నారు. లుక్ పరంగా కూడా ఈ యంగ్ హీరో అట్రాక్ట్ గా ఉన్నాడు. సరిగ్గా రెండు మంచి యూత్ లవ్ స్టోరీస్ గనక పడితే టాలీవుడ్ కి మరో యంగ్ హీరో వచ్చినట్టేనని అనుకుంటున్నారు. అయితే ఈ యంగ్ హీరో లక్ కేవలం లుక్ మీదే కాదు టాలెంట్ కూడా ఉండాలని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: