బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఆస‌క్తిగా సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు టాప్ 5 కంటెస్టెంట్ల‌లో ఇద్ద‌రు కంటెస్టెంట్లు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. వీరిలో ముందుగా అంద‌రికంటే త‌క్క‌వ ఓట్లు వ‌చ్చిన అలీ రెజా బ‌య‌ట‌కు వెళ్లారు. అలీని హీరోయిన్ రాశీఖ‌న్నా, డైరెక్ట‌ర్ మ‌రుతి బ‌య‌ట‌కు తీసుకువెళ్లారు. ఇక రెండో ఎలిమినేష‌న్లో హీరో వ‌రుణ్ సందేశ్‌ను హీరో శ్రీకాంత్‌, హీరోయిన్ కేథ‌రిన్ ఎలిమినేట్ చేసి బ‌య‌ట‌కు తీసుకువెళ్లారు.


రెండో ఎలిమినేష‌న్లో నాగార్జున అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ముందుగా శ్రీకాంత్‌కు ఓ సూట్ కేస్ ఇచ్చి ఆ సూట్ కేసులో రు.10 ల‌క్ష‌లు ఉన్నాయి. ఆ సూట్ కేసులో ఉన్న రు.10 ల‌క్ష‌లు తీసుకుని ఒక‌రు బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌చ్చ‌ని ఆఫ‌ర్ ఇచ్చాడు. అంటే విన్న‌ర్ అవుతామ‌ని డౌట్‌గా ఉన్న వారిలో ఎవ‌రు అయినా ఈ ఆఫ‌ర్ వాడుకోవ‌చ్చని నాగ్ చెప్పాడు. అయితే ఎవ్వ‌రూ ఈ ఆఫ‌ర్ యూజ్ చేసుకోలేదు.


ఆ త‌ర్వాత మ‌రో సూట్ కేసు తీసుకు వ‌చ్చారు. అందులో కూడా మ‌రో రు.10 ల‌క్ష‌లు ఉన్నాయి. మొత్తం రు. 20 ల‌క్ష‌లు తీసుకుని బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌చ్చ‌ని మొత్తం న‌లుగురికి ఆఫ‌ర్ చేశారు. అయితే వీరిలో ఎవ్వ‌రూ కూడా ఈ ఆఫ‌ర్ తీసుకోలేదు. చివ‌ర‌కు కేథ‌రిన్ ఓ ఎన్వ‌ల‌ప్ క‌వ‌ర్ తీసుకుని లోప‌ల‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ క‌వ‌ర్‌ను ఓపెన్ చేయాల‌ని కేథ‌రిన్‌ను కోరారు. 


అయితే కేథ‌రిన్ మాత్రం ఆ క‌వ‌ర్ శ్రీకాంత్‌కు ఇవ్వ‌గా శ్రీకాంత్ ఆ క‌వ‌ర్ ఓపెన్ చేసి వ‌రుణ్ సందేశ్ పేరు చ‌దివి .. వ‌రుణ్‌ను బ‌య‌ట‌కు తీసుకు వెళ్లాడు. వ‌రుణ్ స‌డెన్‌గా ఎలిమినేట్ అవ్వ‌డంతో వితిక సైతం షాక్ అయ్యింది. అంటే వ‌రుణ్ రెండో కంటెస్టెంట్‌గా బ‌య‌ట‌కు వ‌స్తాడ‌ని చాలా మంది ఊహించ‌లేదు. అలాగే చివ‌ర‌గా వ‌రుణ్ రు.20 ల‌క్ష‌లు కూడా మిస్ చేసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: