ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పర బాష హీరోయిన్ల హవా కొనసాగుతుంది. ఇప్పటికే మాలీవుడ్ నుంచి హీరోయిన్లు వరుసగా ఎంట్రీ ఇస్తూ తెలుగులో మంచి సక్సెస్ సాధించి తమిళ, హిందీ పరిశ్రమలో స్థిరపడుతున్నారు. బాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ నుంచి కూాడా కొంత మంది హీరోయిన్లు వస్తున్నారు. ఇక కన్నడ నుంచి సైతం ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు వచ్చినా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అందులో ప్రస్తుతం రష్మిక మందన ఒకరు. 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన సినిమా ద్వారా నటిగా పరిచయమమైంది.
తెలుగు నాగశౌర్య నటించిన ‘ఛలో ’ సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే మొదటి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ అమ్మడికి వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఇక విజయ్ దేవరకొండ తో ‘గీతా గోవిందం’ మూవీలో నటించింది. ఈ మూవీ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. తర్వాత దేవదాస్ సినిమాలో నటించినంది. కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. తర్వాత మరోసారి విజయ్ దేవరకొండతో ‘డీయర్ కామ్రెడ్’ మూవీలో నటించింది. అయితే విజయ్ దేవకొండ తో మంచి కెమిస్ట్రీ వర్క్ ఔట్ కావడంతో ఈ కాంబినేషన్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనే టాక్ వచ్చింది.
తాజాగా రష్మిక తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఫొటో పోస్టు చేసింది. చిన్నప్పుడు ఎలా ఉన్నానో చూడండి అంటూ తన ట్వీట్ లో పేర్కొంది. రష్మిక పోస్టు చేసిన ఈ పిక్ కు ఇప్పటివరకు 1000కి పైగా రీట్వీట్లు, 20 వేలకు పైగా లైకులు వచ్చాయి. గీతగోవిందం హిట్ తో ఈ కన్నడ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం మహేశ్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ గనక సక్సెస్ అయితే తెలుగు, తమిళ, కన్నడ మూవీస్ లో బాగా బిజీగా మరే అవకాశం ఉందని అంటున్నారు అభిమానులు.