బుల్లితెర మీద అక్కినేని నాగార్జున కింగ్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన చేసిన షోలు ఏవీ ఫ్లాప్ అవ్వలేదు. ముఖ్యంగా మీలో ఎవరు కోటీశ్వరుడు ఎంత పాపులర్ షో అయిందో తెలిసిందే. ఈ షో కి బాలీవుడ్ లో అమితాబ్ యాప్ట్ అయ్యారో టాలీవుడ్ లో కింగ్ అంతగా యాప్ట్ అయ్యారు. అయితే తాజాగా నాగార్జున చేసిన బిగ్ బాస్ సీజన్ 3 మాత్రం నాగ్ రేంజ్ లో సక్సెస్ అవ్వలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా స్ట్రయిట్ గా చెప్పాలంటే.. సీజన్-3లో నాగార్జునకు పాస్ మార్కులు మాత్రమే పడతాయి. బాస్ సీజన్ -3 ఈ ఆదివారం తో ముగుస్తున్న సందర్భంగా.. నాగార్జున యాంకరింగ్ ఇలా ఉందని తెలిసింది. 

బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా నాగార్జున ఎంపికయ్యాడనగానే షో కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అందుకు తగ్గట్టుగానే స్టార్టింగ్ లో టీఆర్పీలు కూడా ఒక రేంజ్ లో వచ్చాయి. ఈ టీఆర్పీలు స్టార్ మా ఛానెల్ ను నంబర్ వన్ స్థానంలో ఉంచాయి. అయితే రానురాను నాగార్జున అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో విమర్శలు తలెత్తాయి. అంతేకాదు వంద ఎపిసోడ్ల కార్యక్రమంలో మధ్యలో నాగ్ తీసుకున్న గ్యాప్ కూడా మైనస్ గా మారింది.   

తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ తో విదేశాలకు వెళ్లాడు నాగ్. ఆ టైమ్ లో నాగార్జున స్థానంలో రమ్యకృష్ణ వచ్చింది. రమ్యకృష్ణ అడుగుపెట్టేంత వరకు నాగార్జున ఇంత వీకా అన్న విషయం ప్రేక్షకులకు అర్థంకాలేదు. చేసిన 2 ఎపిసోడ్లలోనే రమ్యకృష్ణ చూపించిన హుందాతనం, కంటెస్టెంట్లను తను విశ్లేషించిన విధానం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తిరిగి నాగ్ షో లోకి ఎంటరయినప్పటికీ రమ్యకృష్ణ మాత్రం ప్రేక్షకుల మనసుల్లో అలానే ఉండిపోయింది. దాంతో నాగార్జునపై ట్రోలింగ్స్ కూడా అప్పట్నుంచే పీక్ స్టేజ్ కు చేరాయి. 

ఇప్పటివరకు 3 సీజన్లు జరిగితే మొదటి సీజన్ లో ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఎనర్టిక్ పర్‌ఫార్‌మెన్స్ తో జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఒక సందర్భంలో రెండో సీజన్ కి కూడా తారక్ అయితే షో రేంజ్ మామూలుగా ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ సీజన్ లో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. కానీ తారక్ మార్క్ కి మాత్రం చాలా దూరంగా ఉండిపోయాడు. అయితే మూడో సీజన్ కోసం అడుగుపెట్టిన నాగార్జున.. వాళ్ళీద్దర్నీ మరిపిస్తాడని అనుకున్నారంతా.
కానీ 3 సీజన్లు ముగిసేసరికి ఇప్పటికీ నాని..నాగ్ కంటే ఎన్టీఆరే బెస్ట్ అంటు ప్రేక్షకులనుంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత స్థానాన్ని కొంతమంది నానికి ఇస్తుంటే.. మరికొంతమంది నాగార్జునకు ఇస్తున్నారు. అంతేతప్ప, ఈ మూడు సీజన్లకు కలిపి వ్యాఖ్యాతగా మొదటి స్థానాన్ని నాగ్ కు ఇచ్చే ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. దీనికి తోడు మహిళా కంటెస్టంట్లను కౌగిలించుకొని, మగ కంటెస్టంట్లను షేక్ హ్యాండ్స్ తో పరిచయం చేయడం కూడా విమర్శలకు తోడైంది. ఇక తొలిసారిగా ఈ ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలే లైవ్ లో నాగ్ పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలి...అనుకున్న వాళ్ళకి చిన్న షాక్ ఇచ్చారు. హమ్మయ్య పరవాలేదులే అన్నట్టు గా నాగ్ పెర్ఫార్మ్ చేసి ఆకట్టుకున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: