స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ  అల .. వైకుంఠపురములో.. ప్రస్తుతం ఈ చిత్రం  యొక్క షూటింగ్  యూరప్ లో జరుగుతుంది. ఈ  షెడ్యూల్ లో లీడ్ పెయిర్ పై  సామజవరాగమన అనే సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.  ఇటీవల విడుదలైన ఈ సాంగ్  యూనానిమస్ పాజిటివ్  రెస్పాన్స్ ను తెచ్చుకుని సాంగ్ అఫ్ ది ఇయర్ గా నిలిచింది.  ప్రస్తుతం యూ ట్యూబ్ లో  ఈసాంగ్ 67 మిలియన్ల పై చిలుకు  వ్యూస్ ను రాబట్టుకోవడమే కాకుండా  అత్యధిక  లైక్స్ తెచ్చుకున్న మొదటి తెలుగు సాంగ్ గా  రికార్డు సృష్టించింది. ఇక కొద్దీ రోజుల క్రితం ఈచిత్రం నుండి  రాములో రాములో  అనే సాంగ్ విడుదలకాగా  ఈ సాంగ్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని   ఇప్పటివరకు 5లక్షల పైగా లైక్స్ ను తెచ్చుకుంది.  తద్వారా  సామజవరగమన తర్వాత  అత్యధిక లైక్స్  తెచ్చుకున్న   తెలుగు సాంగ్ గా రికార్డు  సృష్టించింది.   



ఈసాంగ్స్ సినిమా పై  అంచనాలు  మరింతగా పెరిగాయి.   ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బన్నీ కి జోడిగా పూజాహెగ్డే నటిస్తుండగా టబు , జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజు  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  జనవరి 12న ఈ చిత్రం విడుదలకానుంది.ఇక  త్రివిక్రమ్ -బన్నీ కాంబినేషన్ లో  ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి  కాంబినేషన్  లో వచ్చిన  జులాయి ,సన్ అఫ్ సత్యమూర్తి  మంచి విజయాలు సాధించాయి. మరి ఈ చిత్రం వీరిద్దరికి హ్యటిక్ విజయాన్ని అందిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: