పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు మానేసి రెండేళ్లయింది. పవన్ సినిమా చేయాలని మెగా అభిమానులు, పవన్ తో సినిమా చేయించాలని దర్శక, నిర్మాతలు చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా మళ్లీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడని వార్తలు వచ్చాయి. హిందీలో అమితాబ్, తాప్సీ ముఖ్యపాత్రల్లో వచ్చిన పింక్ సినిమా రీమేక్ లో పవన్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తను బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ ట్వీట్ చేస్తే బోనీ కపూర్ దాన్ని రీట్వీట్ చేసి ఈ వార్త నిజమనిపించాడు.

 


తెలుగులో దిల్ రాజుతో కలిసి బోనీ ఈ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారనేది లేటెస్ట్ టాక్. అయితే.. పవన్సినిమా చేసే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందీలో అమితాబ్ చేసిన లాయర్ పాత్రను పవన్ చేస్తున్నాడని తెలిసి నిట్టూరుస్తున్నారు హార్డ్ కోర్ పవన్ ఫ్యాన్స్. కోర్టులో న్యాయం కోసం వాదించే పాత్ర చేస్తే పవన్ ని సినిమాల్లో చూడాలనుకున్న కిక్ మిస్సవుతామనేది వారి వాదన. పవన్ సినిమా చేస్తే పవర్ ఫుల్ మాస్ చిత్రం చేస్తే జోష్ రావాలి కానీ సైలెంట్ గా కోర్టులో వాదించే లాయర్ పాత్ర చేస్తే తమ దాహం ఏమి తీరుతుందని వాదిస్తున్నారు. దీనికి బదులు పవన్ సినిమాలు చేయకపోవడమే బెటర్ అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.

 


అభిమానుల వాదనా నిజమే. పవన్ లాంటి మాస్ హీరో చేస్తే ధియేటర్లు దద్దరిల్లిపోయే సినిమా చేయాలి కానీ క్లాస్ సినిమా చేస్తే ఉపయోగం ఏముంటుంది. దిల్ రాజుకు ఈ విషయం చెప్పాల్సిన పనిలేదు కానీ పవన్ కు ఈ సినిమా ప్రపోజల్ ఎందుకు తీసుకెళ్లాడో అని కూడా అనుకుంటున్నారు. దాదాపుగా కన్ఫర్మ్ అయిన ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: