యువరత్న
నందమూరి బాలకృష్ణ గత ఏడాది కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం నటించిన జై సింహా
సినిమా తో మంచి
సక్సెస్ ని అందుకున్నప్పటికీ, ఈ ఏడాది
క్రిష్ దర్శకత్వంలో నటించిన
ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన
ఎన్టీఆర్ కథానాయకుడు మరియు
ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల పరాజయాలతో కెరీర్ పరంగా కొంత ఇబ్బందుల్లో పడ్డారు. అయితే గత ఏడాది తనకు
సక్సెస్ నిచ్చిన కె.ఎస్.రవికుమార్ కే మరొక అవకాశం ఇచ్చి ప్రస్తుతం ఆయన దర్శకత్వంలోనే
రూలర్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో హీరోగా నటిస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ
సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇకపోతే దీని తర్వాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా
టాలీవుడ్ మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన ఒక
సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అందుకోసం
బాలకృష్ణ అప్పుడే కొన్ని కసరత్తులు మొదలుపెట్టి శారీరకం గా ఎంతో దృఢంగా తయారైనట్లు తెలుస్తోంది. ఇక దీని అనంతరం, బోయపాటి శ్రీను
బాలకృష్ణ గారి తనయుడు
నందమూరి మోక్షజ్ఞ నటించబోయే తొలి సినిమాకి దర్శకుడిగా వ్యవహరించ నున్నట్లు, నేటి ఉదయం నుండి పలు
టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. వాస్తవానికి మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకి దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలి అనే విషయమై కొన్నాళ్ల నుండి
బాలకృష్ణ ఎంతో ఆలోచ చేస్తున్నారని,
అయితే ఫైనల్ గా అతడి సినిమాకి దర్శకుడిగా బోయపాటి కరెక్ట్ అని భావించి సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తనతో చేయబోయే
సినిమా పూర్తయిన అనంతరం, వీలైనంత త్వరగా మోక్షజ్ఞ తో
సినిమా మొదలవుతుందని టాక్. అయితే నేడు విరివిగా పలు
మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారికంగా ప్రకటన మాత్రం వెల్లడి కావాల్సి ఉంది. మరి ఇదే కనుక నిజమైతే, ఎప్పటినుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న
నందమూరి ఫ్యాన్స్ కి ఇది పెద్ద
పండుగ వార్త అని చెప్పాలి......!!