చిరంజీవి కొరటాల మూవీ షూటింగ్ ఈనెల 11వ తారీఖు నుండి ప్రారంభం కాబోతోంది. ఈ మూవీలో నటించే కీలక నటీనటుల ఎంపిక పూర్తి కావడంతో ఈ
మూవీ షూటింగ్ ను ప్రారంభించడానికి లైన్ క్లియర్ చేసారు. ఇలాంటి పరిస్థితులలో ఈ
మూవీ కథకు సంబంధించిన ఒక ఆ సక్తికర న్యూస్ ఇప్పుడు లీక్ అయింది.
ఈ మూవీలో ఎండోమెంట్స్ ఉద్యోగిగా కనిపించే
చిరంజీవి పాత్ర సింహాచలం దేవాలయం నేపధ్యంలో జరుగుతుందని సమాచారం. దీనికోసం సింహాచలం టెంపుల్ ను పోలిన ఒక భారీ సెట్ లో ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. చాల సంవత్సరాల క్రితం సింహాచలం ఆలయ ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ సంఘటనకు ఆధారంగా ఈ
మూవీ కథ అల్లబడినట్లు తెలుస్తోంది.
దేవాలయాలలో జరుగుతున్న అక్రమ దందా అవినీతి మాఫియా లాంటి విషయాలను హైలెట్ చేస్తూ
కొరటాల శివ ఈ కథను వ్రాసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మార్కిస్ట్ భావాలు ఎక్కువగా ఉన్న
కొరటాల పెద్దగా దేవుడుని నమ్మడు. అయితే ఇప్పుడు
కొరటాల లేటెస్ట్
మూవీ దేవాలయాలలో జరుగుతున్న అవినీతి చుట్టూ తిరగడం అత్యంత ఆశ్చర్యకరం.
‘స్టాలిన్’
మూవీ తరువాత చాల గ్యాప్ తీసుకుని
త్రిష ఈ మూవీలో
చిరంజీవి పక్కన నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో
త్రిష పాత్రకు కూడ నటన రీత్యా చాల ప్రాధాన్యత ఉండటంతో ఆమెను
కొరటాల బలవంతం పెట్టి ఒప్పించాడు అన్న వార్తలు ఉన్నాయి. ఈ మధ్య
త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసిన మెసేజ్ కూడ ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్ ను టార్గెట్ చేస్తూ ఈ
మూవీ విడుదల చేయాలని
కొరటాల గట్టిపట్టుదలతో ఉండి చిరంజీవికి ఒక భారీ హిట్ ఇవ్వడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు..