'సైరా' సినిమాతో సూపర్ హిట్ అందుకొని మంచి జోరు మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో కొరటాలతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. దసరా పండుగ సందర్భంగా కొరటాలతో చేయబోయే సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు మొదలు పెట్టిన చిరంజీవిసినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలలో మొదలుకానున్న నేపథ్యంలో రెడీ అవుతున్న తరుణంలో తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా షో కి కంటెస్టెంట్ సభ్యులు మరియు ఇంటిలో ఉన్న టాప్ ఫైవ్ ఇంటి సభ్యులు కుటుంబ సమేతంగా హాజరు కావడంతో మెగాస్టార్ చిరంజీవి రావటంతో బిగ్ బాస్ హౌస్ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వేదికపై ఉన్న 15 మంది ఇంటి సభ్యులతో ముచ్చటించిన చిరంజీవి...ఒక్కొక్కరితో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో వాళ్ల స్వభావాన్ని గురించి ఎత్తిచూపుతూ అదిరిపోయే పంచులు వేశారు.


ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. ఈ క్రమంలో హౌస్ లో ఇంటి సభ్యులందరినీ పలకరిస్తున్న సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి హేమను సరదాగా ఆట పట్టించాడు. తమ అభిమాన హీరోలిద్దరినీ ఒకే సారి ఇలా చూడటం ఎంతో ఆనందంగా ఉందని హేమ అనగానే వెంటనే నాకు తెలుసులే నా మీద ఏదో గౌరవంతో అలా అన్నావ్ కానీ నా కన్నా నీకు నాగ్ అంటేనే అభిమానం ఎక్కువ హీ -హు - హే అంటూ దీర్గాలు తీసాడు. దానికి హేమ ఏం మాట్లాడా తెలియక కూర్చుండి పోయింది.  ఇదే తరుణంలో తమన్నా సింహాద్రి గురించి మాట్లాడుతూ ఏదో విషయాన్ని లేవనెత్తారు స్ట్రైట్ గా మాట్లాడటం ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఏదైనా తప్పు జరిగితే రఫ్ ఆడించేస్తావు...ఈ స్వభావం చాలా మంచిది తప్పు జరిగినా అది ఫ్రెండ్ చేసిన ఫ్రెండ్షిప్ కట్ చేసుకుని మరి డేర్ గా మాట్లాడతావ్ అంటూ తెగ మెచ్చుకున్నారు.


నేను దీని గురించి ఇదంతా ఎందుకు చెప్పానో నీకు నాకు మాత్రమే తెలుసు అన్నాడు. దీంతో మెగాస్టార్ చిరంజీవి శ్రీ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు అని సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో చిరంజీవి తమన్నా సింహాద్రి ని మెచ్చుకుంటూ ఇతరులకు బాగా పంచులు వేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: