టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబో అని పేరు తెచ్చుకున్నారు
త్రివిక్రమ్ - అల్లు అర్జున్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మంచి విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మరోసారి వీరిద్దిరి కాంబినేషన్ లో 'అల వైకుంఠపురములో' తెరకెక్కుతుంది.
అల్లు అర్జున్ సరసన మరోసారి
పూజా హెగ్డే నటిస్తుంది. గతంలో వీరిద్దరు కలిసి ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలో నటించారు. ఇక విక్టర్
వెంకటేష్ నటించిన ‘కూలీ నెం.1’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది టుబు. అప్పట్లో టబు అందాలకు యూత్ ఫిదా అయ్యారు.
కృష్ణ వంశి దర్శకత్వంలో
నాగార్జున నటించిన ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న టబు తెలుగు,
తమిళ,
కన్నడ,
హిందీ భాషల్లో నటించింది. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న టబు చాలా కాలం తర్వాత
త్రివిక్రమ్ -
బన్ని కాంబినేషన్ లో వస్తున్న ‘అలా వైకుంఠపురములో’ సినిమాలో నటిస్తుంది.
ఈ మూవీలో శ్రీమంతురాలైన 'అలకనందాదేవి' పాత్రలో టబు కనిపించనుంది. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా వుండనున్నట్టు సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. ఈ రోజున ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'అల వైకుంఠపురములో' టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ
సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను వదిలారు.