బిగ్ బాస్ హౌస్ కి బహుమతి అవటానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన పంచులతో సంభాషణలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు పైకి కాంగానే ఉంటే చిలిపిగా చిరంజీవి వేసిన పంచులు తీసిన రాగాలు హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు వేదిక దగ్గర ఉన్న బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్ ఇంటి సభ్యులను చూస్తున్న వీక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మొత్తం మీద వంద రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సీజన్ 3 గ్రాండ్ ఫినాలే కార్యక్రమం ఆదివారం ముగియడంతో టైటిల్ రాహుల్ కి రావడంతో సోషల్ మీడియాలో టైటిల్ విన్నర్ రాహుల్ కి గ్రీటింగ్స్ తెలియజేస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. హౌస్ లో రాహుల్ చాలా జెన్యూన్ గేమ్ ఆడాడు...ఎటువంటి మాస్క్ లేకుండా గేమ్ ఆడింది...రాహుల్ మాత్రమే అని సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు.


ఇదిలా ఉండగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి ఇంటి సభ్యుల గురించి మాట్లాడుతూ టీవీ9 మాజీ యాంకర్ ముఖాముఖి కార్యక్రమానికి స్పెషలిస్ట్ గా పనిచేసిన జాఫర్ మాట్లాడితే తాను షో నుండి వెళ్లిపోతానని లేదంటే జాఫర్ ఏదొఒక కాంట్రవర్సీలో తనను ఇరికిస్తాడని సెటైర్లు వేస్తూ...రాజకీయంగా అనేకమందిని ఇబ్బంది పెట్టిన జాఫర్ నీ మొట్టమొదటిసారి హౌస్లో చూసినప్పుడు ఎవరో ఉసురు గట్టిగా తగిలినట్లు ఉందని షో స్టార్టింగ్ సమయంలో జాఫర్ నీ హౌస్ లో చూసినప్పుడు అనుకున్నానని చిరంజీవి కామెంట్ చేశారు.


దీంతో జాఫర్ ఏం మాట్లాడలేక సైలెంట్ గా కామ్ గా కూర్చుండిపోయాడు. ఇక తాను బిగ్ బాస్ రియాల్టీ షో చూడటానికి కారణం తన వైఫ్ సురేఖ అని చిరంజీవి పేర్కొన్నారు. అందువల్ల హౌస్ లో ఉన్న ఇంటి సభ్యుల స్వభావాలు ముందుగానే గమనించడం జరిగిందని చిరంజీవి చెప్పుకొచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: