అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా చాలా రోజుల తర్వాత మళ్ళీ నిన్న ఢిల్లీ లో అడుగు పెట్టారు. ప్రస్తుతం నెట్ఫ్లిక్ ప్రాజెక్ట్ అయినా 'ది వైట్ టైగర్' లో నటిస్తున్న ప్రియాంక చోప్రా షూటింగ్ చేయడం కోసం ఢిల్లీ వచ్చారు. అయితే ఢిల్లీ లో ఉన్న విపరీతమేనా పొల్యూషన్ నుంచి ఉపశమనం పొందడానికి తను ఒక పొల్యూషన్ మాస్క్ ని ధరించారు. 


ఆ ఫోటో ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ, 'ఢిల్లీ లో పొల్యూషన్ బాగా ఉందని, తమ వద్ద ఎయిర్ ప్యూరీఫైర్స్ మాస్క్ లు ఉండటం మంచిదైందని లేకపోతే తన పరిస్థితిని ఊహించడానికే భయంగా ఉందన్నారు. ఇళ్లులేని వాళ్ళు మాస్క్ లు లేని వాళ్ళ కోసం నేను ప్రాదిస్తున్నా' అని తను రాసారు. 


ప్రియాంక చోప్రా అన్నది అక్షరాలా నిజమే. ఎందుకంటే దీపావళి తర్వాత ఢిల్లీ లోని పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఢిల్లీ ప్రజలు బయటకి రావాలంటేనే జంకుతున్నారు. అందుకే ఢిల్లీ గవర్నమెంట్ పాఠశాలలకు ఈ మంగళవారం వరకు సెలవలు ప్రకటించింది. 


కానీ ఈ పోస్ట్ ని అందరూ పాజిటివ్ తీసుకోలేదు. కొంతమంది నెటిజన్స్ ఈ ఫోటో పై నెగటివ్ కామెంట్స్ చేసారు. మాకు ఆరోగ్య సలహాలు చెప్పే ముందు మీరు సిగరెట్ తాగే అలవాటు మారండి అని ఒకరు విమర్శించారు. మరొకరు ప్రియాంకకు ఆస్తమా జబ్బు ఉందని మీరు మా కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని ఉచిత సలహా ఇచ్చారు. ప్రియాంక చోప్రా తన ఐదేళ్ల వయసులోనే ఆస్తమా జబ్బుకి గురయ్యారు. అయితే ఆమెకు ఆస్తమా ఉన్నపటికీ తన భర్తతో కలిసి సిగరెట్ తాగడంతో మళ్ళీ ఆ ఫొటోస్ బయటకు రావడంతో, చాలా మంది నెటిజన్స్ ఆమెని తీవ్రంగా తిట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: