నిను వీడని నీడను నేనే` చిత్రంతో సూపర్హిట్ సాధించిన
యువ కథానాయకుడు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్ప్రెస్`. సోమవారం ఈ
సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్,
అభిషేక్ అగర్వాల్,
సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మురళీశర్మ, రఘుబాబు,
సందీప్ కిషన్లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హకీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న తొలి తెలుగు చిత్రమిది. అలాగే ఈ జోనర్లో
సందీప్ కిషన్ చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు.
ఇటీవలె
సందీప్ నిర్మించిన నిను వీడని నీడను నేనే చిత్రాన్ని
రీమేక్ చేసేందుకు
హిందీ మేకర్స్ ముందుకొచ్చారు. ఈ విషయాన్నిస్వయానా సందీప్ సోషల్
మీడియా ద్వారా వెల్లడించారు.
స్త్రీ నిర్మాతలు, షోర్ ఇన్ ది సిటీ దర్శకులు రాజ్, డీకేలు. వారు నా మార్గదర్శకులు, సోదరులు . నా
సినిమా రీమేక్ రైట్స్ వారు తీసుకున్నారు. నా
సినిమా మంచి చేతుల్లో పడినందుకు ఆనందంగా ఉందని
సందీప్ తన ట్వీట్ లో తెలిపాడు.
తొలిసారి
థ్రిల్లర్ జోనర్ని ఎంచుకున్నారు. తనే నిర్మాతగా మారి మిత్రులతో కలిసి నినువీడని నీడను నేనే అంటూ
థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించారు. కొత్త దర్శకుడు కార్తిక్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాని వేరే భాషలలో
రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ఇక ఈ `A1 ఎక్స్ప్రెస్` చిత్రం కూడా సందీప్కి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రేంజ్లో హిట్ రావాలని ఆశిద్దాం.