‘సైరా’ రికార్డుల విషయాన్ని పక్కకు పెడితే సురేంద్ర రెడ్డికి ఆ మూవీ పేరుతో పాటు ఆర్ధికంగా కూడ బాగా కలిసి వచ్చింది. ఈ మూవీకి దర్శకత్వం వహించినందుకు 10 కోట్ల పారితోషికం చరణ్ ఇచ్చినట్లు టాక్. ఈ భారీ పారితోషికాన్ని సురేంద్ర రెడ్డి చరణ్ సలహా మేరకు ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న ఒక హోటల్ బిజినెస్ లో పెట్టుబడిగా పెట్టిన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం సురేంద్ర రెడ్డి మళ్ళీ ఒక భారీ సినిమాను తీయాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయాలను గ్రహించిన దిల్ రాజ్ సురేంద్ర రెడ్డితో ఒక ఎగ్రిమెంట్ చేసుకుని ఒక భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు సురేంద్ర రెడ్డి ఇప్పటికే తయారు చేసుకున్న ఒక కౌ బాయ్ స్టోరీని పుచ్చుకుని మహేష్ ప్రభాస్ ల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. 

వీరిద్దరూ సురేంద్ర రెడ్డి చెప్పిన కథ విని తమ నిర్ణయాన్ని చెప్పడానికి మటుకు కొంత సమయాన్ని అడిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తరువాత ఖాళీ అయిపోతున్నాడు. ప్రభాస్ కూడ జిల్ రాథా కృష్ణ మూవీ తప్ప మరే సినిమా చేయడం లేదు. దీనితో వీరిద్దరిలో ఎవరో ఒక్కరిని ఒప్పిస్తే సురేంద్ర రెడ్డి మూవీ ప్రాజెక్టు 100 కోట్లు పెట్టుబడి పెడతానని దిల్ రాజ్ చెపుతున్నట్లు సమాచారం. 

అయితే గతంలో మహేష్ సురేంద్ర రెడ్డిని నమ్ముకుని ‘అతిధి’ గా వచ్చి ఫెయిల్ అయ్యాడు. ఇప్పటికీ ప్రభాస్ ‘సాహో’ షాక్ ల నుండి బయటకు రాలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో సురేంద్ర రెడ్డి మాటల ఉచ్చులో చిక్కుకుంటే తాము ఎంతవరకు సేఫ్ అన్న ఆలోచనలలో మహేష్ ప్రభాస్ లు ప్రస్థుతానికి తమ నిర్ణయాలను వాయిదా వేస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: