పవర్స్టార్ పవన్కల్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి
సినిమా తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తానని చెప్పిన పవన్ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు మళ్లీ యూ టర్న్ తీసుకుంటోన్న పరిస్థితి. ఈ యేడాది జరిగిన ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేసినా రెండు చోట్లా ఘోరంగా ఓడిపోయాడు. పవన్ రీ ఎంట్రీ
సినిమా ఇప్పటికే ఫిక్స్ అయ్యింది.
బాలీవుడ్లో విజయవంతమైన `పింక్` చిత్రాన్ని తెలుగులో
రీమేక్ చేయనున్నారు. అక్కడ
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబచ్చన్ చేసిన పాత్రను ఇక్కడ పవన్ చేయనున్నారు. ఇద్దరు అగ్ర నిర్మాతలు ఈ సినిమాను నిర్మించనున్నారు.
టాలీవుడ్ అగ్ర
నిర్మాత దిల్రాజుతో పాటు
బాలీవుడ్ స్టార్ నిర్మాత బోనీకపూర్ నిర్మాతలుగా ఈ
సినిమా తెరకెక్కనుంది.
గతంలో దిల్ రాజు బ్యానర్లో ఓ మై ఫ్రెండ్
సినిమా డైరెక్ట్ చేసిన వేణు
శ్రీరామ్ దర్శకత్వంలో ఈ
సినిమా రూపొందనుంది. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు.
సినిమా సెట్స్ మీదకు వెళ్లే టైంకే పక్కా ప్రణాళికతో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోవాలని దర్శక, నిర్మాతలు
ప్లాన్ చేస్తున్నారు. కంటిన్యూగా జరిగే షెడ్యూల్తో ఈ
సినిమా షూటింగ్ను ఫినిష్ చేయాలని భావిస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత తమ
హీరో ఇక సినిమాలు చేయడని డిజప్పాయింట్ అయిన హీరోలకు పవన్ మళ్లీ సినిమాలు చేస్తున్నాడన్న వార్తతో ఎక్కడా లేని జోష్ కూడా వచ్చింది.
ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ సరసన
హీరోయిన్ పాత్రలో నయనతారను నటింప చేయాలని అనుకుంటున్నారట. పాత్ర నిడివి తక్కువగానే ఉండటంతో పాటు ఇప్పటి వరకు నయన్, పవన్ జోడీ కలిసి నటించకపోవడంతో ఈ జోడీ ప్రెష్లుక్గా ఉంటుందని భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో నటిస్తున్నందుకు పవన్కు రు.50 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.