టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, సినీ నటుడు మోహన్ బాబు మంచి మిత్రులు. ఇద్దరిదీ చిత్తూరు జిల్లావే. ఇద్దరూ ఒకేసారి వారి వారి రంగాల్లోకి వచ్చారు. ఇక ఇద్దరు బంధువులు కూడా.   ఇంతలా అనుబంధం ఉన్న ఈ ఇద్దరు  ఈ మధ్యకాలంలో రాజకీయంగా విడిపోయారు. వైసీపీలో మోహన్ బాబు చేరి జగన్ పక్షాన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేసారు.  ఆ సమయంలో బాబు మీద హాట్ కామెంట్స్ చేసారు. మరి ఎన్నికలు జరిగిన ఇన్నాళ్ళకు మోహన్ బాబు వర్సెస్ చంద్రబాబు మరోమారు బయటకు వచ్చింది.

 

దీనికి కారణం రెండు రోజుల క్రితం మోహన్ బాబు మీద క్రమ శిక్షణ లేని మనిషి అంటూ  చంద్రబాబు హాట్ కామెంట్స్ చేసారట. అ సందర్భం ఏంటి, ఎక్కడ, ఎవరితో అన్నది తెలియకపోయినా మోహన్ బాబు ఈ రోజు తన ట్వీట్ చేస్తూ చంద్రబాబు మీద ఘాటైన పదజాలమే వాడారు. ఈ దేశంలో క్రమశిక్షణ లేని వ్యక్త్రి స్నేహానికి అర్ధం తెలియని వ్యక్తీ  ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబెనని మోహన్ బాబు పేర్కొన్నారు.

 

ఎన్నికలు అయిపోయాయి, ఎవరి బతుకులు వారు బతుకుతున్నాం, మధ్యలో ఇలా అని మనసుని బాధపెట్టడం ఎందుకు చంద్రబాబు అంటూ మోహన్ బాబు ఘాటుగా సూటిగా నిలదీసారు. అన్న నందమూరితో పాటు, అక్కినేని వంటి వారు మోహన్ బాబు క్రమ శిక్షణ కలిగిన వారు అని కితాబు ఇచ్చారని అన్నారు. అటువంటిది  చంద్రబాబు ఇలా అనడం దారుణమని మోహన్ బాబు గరం గరం అయ్యారు. ఏమైనా ఆయన డైలాగ్ కింగ్ కదా. అందుకే తనదైన తీరులో గట్టిగానే వేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: