టాలీవుడ్ లోకి స్టార్ హీరోల వారసులు హీరోలుగా వస్తున్న తరుణంలో ప్రముఖ విప్లవ దర్శకులు టి కృష్ణ తనయుడు గోపిచంద్ ‘తొలివలపు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు..దాంతో వెండితెరపై కెరీర్ కొనసాగించే క్రమంలో విలన్ అవతారం ఎత్తాడు.  జయం, వర్షం,నిజం సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు.  ఆ తర్వాత హీరోగా రణం సినిమాతో తానేంటో నిరూపించుకున్న గోపిచంద్ వరుస గా సక్సెస్ అందుకున్నాడు. లౌక్యం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న గోపిచంద్ తర్వాత వరుస అజయాలతో సతమతమవుతున్నాడు. 


కష్టపడి పైకొచ్చిన నటుల్లో గోపీచంద్ ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వందలకోట్ల మార్కెట్ లేకపోయినప్పటికీ గోపీచంద్ గురించి అందరికి తెలుసు. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ మనోడి బ్యాడ్ లక్ ఏమిటో గా స్టార్ హీరోల రేంజ్ లోకి రాలేకపోతున్నారు.  ఇక దసరా సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చాణక్య అయితే మరీ దారుణంగా నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా దేశ రక్షణకు సంబంధించినదైనప్పటికీ పెద్దగా ఆడియన్స్ కి మాత్రం రీచ్ కాలేకపోయింది.   ఆ దెబ్బతో గోపి కొత్త సినిమా ఒకటి ఆగినట్లు టాక్ వచ్చింది.


ఇక సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమా మాత్రం సెట్స్ పైకి వచ్చింది.  అయితే ఈ సినిమా ఎలాగైనా సక్సెస్ అవ్వాలని గోపీచంద్ చాలా కష్టపడుతున్నాడు. ఫిట్ నెస్ లో కూడా చాలా మార్పులు తేనున్నాడట. ఇకపోతే సినిమా బడ్జెట్ దృష్ట్యా గోపీచంద్ రెమ్యునరేషన్ ని ముందే తీసుకోవడం లేదని టాక్ వస్తోంది.  గత సినిమాల రిజల్ట్ కారణంగా మార్కెట్ బాగా తగ్గిపోవడంతో గోపి పారితోషికానికి ఎఫెక్ట్ పడ్డట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతలు గోపీచంద్ కి ముందే రెమ్యునరేషన్ ఇవ్వలేమని సినిమా బిజినెస్ ను బట్టి షూటింగ్ ఎండింగ్ లో ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారట. పరిస్థితి బాలేకపోవడంతో గోపి కూడా సైలెంట్ గా సినిమా చేసుకుంటూ వెళుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: