మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా బిగ్ బాస్ 3 సీజన్ ఫైనల్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఫైనల్ లో విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కు చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ 3 ట్రోఫీ అందించి సీజన్ ను గ్రాండ్ గా ముగించాడు బిగ్ బాస్. అయితే.. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. వివాదాస్పదమైన విషయాన్ని ప్రస్తావించిన చిరంజీవి తన చాతుర్యంతో వివాదం కాకుండా శెభాష్ అనిపించుకున్నాడు.

 

 

ఫైనల్ విజేత్ ప్రకటించటానికి ముందు పార్టిసిపెంట్స్ ను చిరంజీవి స్వయంగా పలుకరిస్తూ, చమత్కరిస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ తరుణంలో ఈసారి తమన్నా వంతు వచ్చింది. ‘ఓ.. నువ్వు తమన్నా. డేరింగ్ లేడీ. తాను నమ్మినదానికి ఎంతకైనా తెగించి పోరాడే తత్వం ఉన్న అమ్మాయి. పోరాటంలో తన స్నేహితుల తప్పు ఉందన్న విషయం తెలిస్తే వారిని కూడా వదులుకుని వారిపైనే పోరాటం చేసే తెగువ ఉన్న డేరింగ్ పర్సనాలిటీ. ఈ విషయంలో నిన్ను అభినందిస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానో మనిద్దరికీ మాత్రమే అర్ధమవుతుంది’ అంటూ చిరంజీవి ఒకింత గంభీర స్వరంతో అన్నాడు. చిరంజీవి మాటలకు తమన్నా కూడా భావోద్వేగానికి గురై కన్నీళ్ల పర్యంతమయింది. ఆమధ్య రామ్ గోపాల్ వర్మ ప్రోద్భలంతో పవన్ కల్యాణ్ ఇష్యూలో శ్రీరెడ్డి చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్య గురించే చిరంజీవి ఇలా స్పందించి శ్రీరెడ్డికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. 

 

 

ఆ సమయంలో చిరంజీవి సంయమనం కోల్పోలేదు. నాగబాబు, పవన్ లే అన్నీ చూసుకున్నారు. ఇన్నాళ్లకి చిరంజీవి తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీరెడ్డి వ్యాఖ్యల్ని తనదైన శైలిలో తప్పుపట్టాడు. ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందించటానికి ఏమాత్రం అవకాశం లేని చిరంజీవి మాటల్లోని చాతుర్యాన్ని అభినందించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: