ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే అది మంచు మోహన్ బాబు అనే చెబుతారు. మనసులో ఏదున్నా సరే అది ఖరాకండిగా చెప్పడంలో మోహన్ బాబు తర్వాతే ఎవరైనా.. అయితే సినిమా ఫంక్షన్స్ లో తను చేసే హడావిడి అందరికి తెలిసిందే. అందుకే మోహన్ బాబుతో పెట్టుకోవడానికి ముందు వెనుక ఆలోచిస్తారు.     


అయితే మోహన్ బాబు ఎప్పుడైతే రాజకీయపరమైన విషయాల్లో జోక్యం చేసుకున్నాడో ఇప్పుడు ఆయన్ను కూడా ఎవరు వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఒకప్పుడు అన్న ఎన్.టి.ఆర్ ఉన్నప్పుడు పార్టీని అభిమానించిన మోహన్ బాబు ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను చూసి నివ్వెరపోతున్నారు.  రెండు రోజుల క్రితం తన గురించి బాబు మాట్లాడటం గురించి చెబుతూ తన ఆవేదన తెలియచేశారు మోహన్ బాబు.   


క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చంద్రబాబుని ఉద్దేశించి అన్నారు. ఎలక్షన్స్ అయిపోయాయి.. ఎవరు దారిన వాళ్లం ఉన్నారు.. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు.. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఈ టైంలో మళ్లీ నా మనసుని ఇబ్బంది పెడతావని అనుకోలేదని ట్వీట్ చేశారు మోహన్ బాబు.       


అన్న ఎన్.టి.ఆర్, అక్కినేని నాగేశ్వర రావు గారు ఇంకా నా సినిమా పరిశ్రమ మొత్తం క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అంటే మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు.. అది అందరికి తెలుసు.. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహానికి అనే పదానికి అర్ధం తెలియని వ్యక్తి ఈ దేశంలో నువ్వు ఒక్కడివే.. దయచేసి ఇక మీదట ఏ సందర్భంలోనూ నా పేరు భంగం కలిగించేట్టు ప్రస్థావించకు.. అది నీకు నాకు మంచిది.. ఎక్కడైనా ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం అది నీకు ఇష్టమైతే.. ఉంటా అంటూ ట్విట్టర్ లో బాబుకి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు మోహన్ బాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: