సినీ ఇండస్ట్రీ వాళ్ళ పెళ్లిళ్లు అసలు నిలబడవు. అది
హాలీవుడ్ ఆలుమగలు అయినా
బాలీవుడ్ అయినా చివరికి
టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడమనేది చాలా సహజం. చివరి వరకు నిలబడే వివాహ బందాలకన్నా వెంటనే విడిపోయే జంటలే ఎక్కువ. మొన్నటికి మొన్న
మోహన్ బాబు చిన్న కుమారుడేనా
మంచు మనోజ్ తన
భార్య ప్రణతి రెడ్డితో ఉన్న తన వివాహ బంధానికి తెగదెంపులు చేసుకున్నాడు.
ఇక అక్కినేని అఖిల్ నిచితార్థం ఇలా అయ్యిందో లేదో కానీ ఆ జరగబోయే వివాహం ఆగిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సినీ కళాకారులూ
పెళ్లి చేసుకొని న్యాయపరంగా విడిపోయారు. ఆ లిస్ట్ లో కొత్తగా ఒక జంట చేరపోతుందనే వార్తలు వస్తున్నాయి. ఆమె ఒక తెలుగు మాజీ స్టార్
హీరో కూతురని, పెళ్లయినా చాలా కాలం నుంచి విదేశాల్లో ఉండే తన భర్తకు దూరంగానే ఉంటుందని తెలుస్తుంది.
అమెరికాలో చాలా కాలం నివసించి
ఇండియా కి వచ్చి
టెలివిజన్ తారగా ఇపుడిపుడే తెలుగు అభిమానులకు పరిచయం అవుతున్న ఈ
అమ్మాయి యాస కె చాలా మంది అభిమానులు ఉన్నారు. ఒకసారి ఆమె ఎవరో అని మీరు ఆలోచిస్తే కనిపెట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఆమెకి
బిజినెస్ మ్యాన్ అయినా తన భర్తతో ఉండాలన్న ఉద్దెశమే లేదని విడాకుల తీసుకోవాలనే ఆలోచనలో ఎప్పటినుంచో ఉందని సమాచారం.
ఆమెకు బాగా తెలిసిన వాళ్ళు విడాకులు తీసుకోవద్దని ఎంత బతిలాడిన ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోకుండా చాలా మొండిగా ఉన్నారని చెపుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు ఎందుకంటే తన
భర్త ప్రవర్తన సరిగా ఉండదు. అందుకే విసుక్కుపోయినా ఆమె అతనికి దూరం గా హాయ్ గా ఉంటుందనే సమాచారం ఉంది. త్వరలోనే ఆమె అఫీషియల్ గా విడాకులు తీసుకుంటారని తెలుస్తుంది.