బీటౌన్ స్టార్స్ సల్మాన్ఖాన్, అక్షయ్కుమార్ ల ఫైట్ వెరీ ఇంట్రస్టింగ్గా మారింది. ఈ
బాలీవుడ్ బడా హీరోలు ఇద్దరూ సౌత్ డైరెక్టర్ల పైనే హోప్స్ పెట్టుకున్నారు. అంతేనా... సల్లూభాయ్ బంపర్ హిట్ సీక్వెల్ని నమ్ముకుంటే అక్షయ్కుమార్
సౌత్ రీమేక్తో ఫెస్టివల్ బరిలోకి దిగుతున్నారు. కండలవీరుడు సల్మాన్ఖాన్, కిలాడీ అక్షయ్కుమార్
బాలీవుడ్ లో బడా స్టార్స్గా హవా సాగిస్తున్నారు. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ నటించిన భారత్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇకపోతే అక్షయ్ వరుస సక్సెస్లతో ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఇటీవలె విడుదలైన హౌస్ఫుల్ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు మాత్రం 150కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు బడాస్టార్స్ ఇద్దరూ ఈద్ బరిలోకి దిగడం హాట్ టాపిక్గా మారింది.
రంజాన్ ఫెస్టివల్ సల్మాన్ఖాన్కి సక్సెస్ సెంటిమెంట్గా మారింది. ప్రతి సంవత్సరం రంజాన్కి కండలవీరుడు తన సినిమాని విడుదల చేస్తున్నాడు. భారత్ సినిమాను సైతం సల్లూభాయ్
రంజాన్ కానుకగా విడుదల చేశాడు. కానీ ఎందుకోగాని ఈ
సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. అయినప్పటికీ సల్మాన్ తన తర్వాత చిత్రం రాధేతో మరోసారి
రంజాన్ బరిలో దిగుతున్నారు. ప్రభుదేవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వాంటెడ్కి సీక్వెల్గా నిలుస్తోంది.
వాంటెడ్ చిత్రం మహేష్బాబు పోకిరి చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన సంగతి తెలిసిన విషయమే.
రంజాన్ బరిలో దిగబోతున్న సల్లూభాయ్కి అక్షయ్తో ఈసారి గట్టిపోటీ ఉండబోతుంది. ఇకపోతే ఈ
బాలీవుడ్ కిలాడీ లక్ష్మీబాంబ్ చిత్రాన్ని ఈద్కి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం డాన్స్మాస్టర్, యాక్టర్
లారెన్స్ నటించిన కాంచన చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతోంది. అంతేకాదు ఈ
బాలీవుడ్ చిత్రానికి
లారెన్స్ డైరెక్షన్ చేయడం మరో విశేషం. ఇకమరి ఈ
సౌత్ డాన్స్ మాస్టర్స్తో సినిమాలు చేస్తున్న
బాలీవుడ్ హీరోలకు ఎలాంటి హిట్లు వస్తాయో వేచి చూడాలి.