టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. తొలి సినిమా ప్రాణం ఖరీదు నుండి మొన్నటి సైరా నరసింహారెడ్డి వరకు, వయసు ఎంత పెరుగుతున్నప్పటికీ కూడా మెగాస్టార్ నటన మరియు టాలెంట్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇకపోతే రెండు రోజుల క్రితం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో ప్రత్యేక అతిథిగా విచ్చేసి ఎంతో సందడి చేసిన మెగాస్టార్, ఆ షోకు హోస్ట్ అయిన అక్కినేని నాగార్జునతో కలిసి కాసేపు సరదాగా అందరినీ ఆకట్టుకున్నారు. 

ఇకపోతే తాను కూడా రెగ్యులర్ గా కాకపోయినా మధ్యలో అప్పుడప్పుడూ బిగ్ బాస్ షోని చూస్తుంటానని  చెప్పిన మెగాస్టార్, షాకింగ్ గా షోలోని ప్రతి ఒక్క పార్టిసిపెంట్ యొక్క వ్యక్తిత్వం మరియు గుణగణాల గురించి ఎంతో బాగా చెప్పి పార్టిసిపెంట్స్ తో సహా ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఆ గ్రాండ్ ఫినాలే లో కేవలం ఒక్క గంట మాత్రమే సందడి చేసిన మెగాస్టార్, యావత్ ప్రేక్షకలోకాన్ని తనవైపు తిప్పుకున్నారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఆయన ఉన్న గంట సేపు కూడా, ఎంతో సరదాగా పార్టిసిపెంట్స్ ని మరియు హోస్ట్ నాగార్జున గారిని ఎన్నో రకాల ఫన్నీ ప్రశ్నలు మరియు డైలాగ్స్ తో ఆకట్టుకోవడంతో పాటు షోకి మరింత వన్నె తీసుకువచ్చారు. 

అయితే ఈ విషయమై నేడు ఒక ఫన్నీ వార్త పలు సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, వాస్తవానికి తన టాలెంట్ తో బిగ్ బాస్ సీజన్ 3 లో అందరినీ ఎంతో ఆకట్టుకున్న నాగార్జున గారు సైతం మెగాస్టార్ గారు షోలో ఉన్న ఆ గంటసేపు తాను ఎంతో సరదాగా ఎంజాయ్ చేసానని, అంతేగాక తనని కూడా మించిపోయేంతగా అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్న మెగాస్టార్ ని చూసి నాగ్ అసూయపడ్డట్లు చెప్తున్నారు. అయితే ఇది ఒకరకంగా ఫన్నీగా ప్రచారం అవుతున్న వార్తే తప్ప, అక్కినేని మరియు మెగా ఫ్యాన్స్ మధ్య ఎటువంటి విబేధాలు సృష్టించాలని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: