గత కొంతకాలంగా
చిరంజీవి తన ఉపన్యాసాలలో హాస్యాన్ని జోడించి టాప్ ఫిలిం సెలెబ్రెటీలను కూడ కార్నర్ చేస్తూ ఇండస్ట్రీలోని తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ నేపధ్యంలో మొన్న భాగ్యనగరంలో జరిగిన తెలుగు
సినిమా రచయితల సంఘం రజితోత్సవాలకు ముఖ్య అతిధిగా
చిరంజీవి రావడమే కాకుండా అనేక ఆసక్తికర విషయాలతో ఉత్తేజకరమైన ఉపన్యాసం చేసాడు.
ఈ సందర్భంలో
చిరంజీవి బయటపెట్టిన
మోహన్ బాబు ఇంటిలోని సింహాసనం సీక్రెట్ అందరితోను నవ్వులు కురిపించింది. ఈ మధ్య
మోహన్ బాబు ఇంటిలో జరిగిన
దీపావళి విందు కార్యక్రమానికి చిరంజీవితో పాటు
ప్రభాస్ రాఘవేంద్రరావు కృష్ణంరాజు రైటర్ సత్యానంద్ లాంటి వాళ్ళు అనేకమంది ఆ విందు కార్యక్రమానికి వచ్చిన విషయాన్ని
చిరంజీవి తెలియ చేస్తూ ఒక షాకింగ్ నిజం బయటపెట్టాడు.
మోహన్ బాబు డ్రాయింగ్ రూమ్ లో ఒక పెద్ద సింహాసనాన్ని పోలిన ఒక కుర్చీ ఉంటుందట. ఆ కుర్చీలో ఒక్క
మోహన్ బాబు తప్ప ఆయన కుటుంబ సభ్యులు కూడ కూర్చోవడానికి భయపడతారట. అయితే
చిరంజీవి చిలిపి తనంతో రైటర్ సత్యానంద్ ని బలవంత పెట్టి
మోహన్ బాబు కుర్చీలో కూర్చునేలా ఒప్పించాడట.
ఈలోపున లోపల నుంచి బయటకు వచ్చిన
మోహన్ బాబు సత్యానంద్ తన సింహాసనం కుర్చీలో కూర్చోవడం గమనించి కొద్దిగా అసహనానికి లోనైనా ఆ విషయాన్ని బయటపడకుండా ఒక రచయితకు సముచిత గౌరవం ఇచ్చారు అంటూ
మోహన్ బాబు ఆనంద పడ్డాడట.దీనితో
మోహన్ బాబు ఇంటిలోని సింహాసనంలో మెగా స్టార్ హోదాలో ఉన్న తాను కూడ కూర్చోవడానికి చేయని సాహసం ఒక
రచయిత చేసినప్పుడు
మోహన్ బాబు ఆ విషయాన్ని గౌరవించాడు అంటే
మోహన్ బాబుకు రచయితలు అంటే ఎంత గౌరవమో అర్ధం అవుతుంది అంటూ ఇప్పటి వరకు ఎవరికీ తెలియని
మోహన్ బాబు సింహాసనం గుట్టు బయటపెట్టాడు ...