పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ లో నటిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తల పై మొట్టమొదటి సారిగా పవన్ స్పందించాడు. నిన్న తనను కలిసిన ఒక మీడియా సంస్థ ప్రతినిధితో పవన్ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ‘మీరు మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయిగా’ అంటూ ఆ మీడియా సంస్థ ప్రతినిధి అడుగుతున్న ప్రశ్నను పూర్తి చేయకుండానే పవన్ విభిన్నంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

రాజకీయాలలో ఉన్నవారు ఎవరి వ్యాపారాలు ఎవరు మానుకుంటున్నారు అంటూ రివర్స్ పంచ్ వేయడమే కాకుండా "అవంతి గారికి కాలేజీలు మూసేసి రాజకీయాల్లో ఉన్నారా? జగన్ గారికి జగతి పబ్లికేషన్స్ భారతి సిమెంట్స్ వ్యాపారాలు లేవా?" అంటూ ఎదురు ప్రశ్నలు వేసాడు పవన్. తనకు వచ్చినది సినిమాలలో నటన మాత్రమే అనీ అది తప్ప తనకు ఏవిషయం తెలియదు అంటూ కామెంట్ చేసాడు.

అంతేకాదు తాను సినిమాలలో నటిస్తానా లేదా అన్నది తనకే తెలియదు అనీ అయితే తాను నిర్మాతగా కొనసాగుతూ కొన్ని సినిమాలు తీస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. పవన్ లేటెస్ట్ గా ఇస్తున్న క్లారిటీ బట్టి ‘పింక్’ రీమేక్ లో పవన్ నటించే విషయంలో ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు అనిపించడం లేదు. 

ఒకవైపు ఈ మూవీ స్క్రిప్ట్ వ్యవహారాలు వేగం పుంజుకోవడమే కాకుండా ‘పింక్’ రీమేక్ లో తాప్సీ పాత్రలో పూజ హెగ్డేని ఒప్పించడానికి స్వయంగా బోనీకపూర్ రంగంలోకి దిగి పూజా హెగ్డేను వ్యక్తిగతంగా కలిసినట్లు ఫోటోలతో పాటు వార్తలు కూడ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో పవన్ లేటెస్ట్ గా ఈ కామెంట్స్ చేయడంతో అసలు పవన్ మనసులో ఏముంది ‘పింక్’ రీమేక్ కు పవన్ ఒప్పుకోకుండా ఇంత హడావిడి ఎందుకు జరుగుతోంది అన్న విషయం సమాధానం లేని ప్రశ్నలుగా మారుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: