ఈ మద్య తెలుగులో ప్రయోగాత్మక సినిమాకు పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కొత్త హీరోలు, దర్శకులు తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు.  ఆ మద్య షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్న తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘పెళ్లిచూపులు’ సినిమా తీశారు.  తక్కువ బడ్జెట్..కొత్త నటులు, కొత్త దర్శకుడు కానీ కంటెంట్ సూపర్ గా ఉండటంతో ‘పెళ్లిచూపులు’ మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాక ఉత్తమ మాటల రచయితగా కూడా అతనికి జాతీయ పురస్కారం దక్కింది. తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగా మారాడు. 

విజయ్ దేవరకొండ నిర్మాతగా తనకు పెళ్లి చూపులు సినిమాతో బ్రేక్ ఇచ్చిన తరుణ్‌ను హీరోగా మార్చే బాధ్యతను తీసుకున్న విషయం తెలిసిందే. కామెడీ, ఎంటర్‌టైనర్‌గా, విభిన్నమైన కథతో రూపొందిన ‘ మీకు మాత్రమే చెప్తా’  ఈ సినిమాలో తరుణ్ భాస్కర్‌కు జోడిగా ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ నటించారు.  ఈ మూవీలో  కథ నాలుగు క్యారెక్టర్ల మధ్య సాగింది.   షామీర్‌ సుల్తాన్‌ను దర్శకుడిగా తొలిపరిచయమే అయినా మంచి అనుభవం ఉన్నవాడిలా సినిమా తెరకెక్కించాడు. 

నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలిరోజు నుండే మంచి సక్సెస్ టాక్ ముందుకు సాగుతోంది. ఇకపోతే మొదటి వీకెండ్ లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.4.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. వాణి భోజన్, అభినవ్ గోమఠం, అనసూయ భరద్వాజ్ వంతిక మిశ్రా, వినయ్‌ వర్మ, నవీన్‌ జార్జ్‌ థామస్‌, పావని గంగిరెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శివ కుమార్ సంగీతం అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: