రాబోతున్న
సంక్రాంతి వార్ బన్నీ
మహేష్ ల మధ్య ‘ఇగో’
వార్ గా మారిన నేపధ్యంలో ఈ రెండు సినిమాలకు సంబంధించి మధ్యలో సీనియర్
హీరోయిన్స్ రగడ జరగడం అత్యంత సంచలనంగా మారింది. వాస్తవానికి ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలకు సంబంధించి హీరోలు బన్నీ
మహేష్ లు అయినప్పటికీ ఈ మూవీలలో కీలక పాత్రలు చేస్తున్న టబు విజయశాంతిలకు కూడ అత్యంత ప్రాధాన్యత ఉంది.
ఈ మూవీలో నటించిన వీరిద్దరికీ భారీ పారితోషికాలు ఇవ్వడమే కాకుండా ఈ రెండు మూవీల కథ వీరిద్దరి చుట్టూ తిరుగుతుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ లో
విజయశాంతి ప్రొఫిసర్ పాత్రను చేస్తుంటే ‘అల వైకుంఠపురములో’ టబు ధనవంతురాలైన గృహిణి పాత్రను పోషిస్తోంది.
ఈ రెండు సినిమాలకు సంబంధించి హీరోలతో సమానంగా వీరి పాత్రలను డిజైన్ చేయడమే కాకుండా వీరి లుక్ గెటప్ విషయంలో కూడ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
విజయశాంతి కోసం అనీల్ రావిపూడి పట్టుపట్టి ఒప్పిస్తే టబు కోసం
త్రివిక్రమ్ ఆమెను బలవంత పెట్టి ఒప్పించాడు. దీనికితోడు
విజయశాంతి 13 సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ ఇస్తుంటే టబు కూడ చాల కాలం తరువాత ఈమూవీ ద్వారా మల్లీ తెలుగు సినిమాలలోకి అడుగు పెడుతోంది.
దీనితో ఈ ఇద్దరి సీనియర్
హీరోయిన్స్ లో ఎవరు ఎవరి పై ఆధిపత్యం సంపాదిస్తారు వీరి నటన లుక్ వల్ల ఏ సినిమాకు ఘన విజయం లభిస్తుంది అన్న అంచనాలతో కేవలం
మహేష్ బన్నీల మధ్యన మాత్రమే కాకుండా
విజయశాంతి టబుల మధ్య
సంక్రాంతి వార్ నడుస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీకి జరుగుతున్న భారీ
బిజినెస్ కేవలం హీరోల ఇమేజ్ ని చూసి మాత్రమే కాకుండా టబు
విజయశాంతి లను చూసి కూడ
మార్కెట్ జరుగుతూ ఉండటం ఈ సీనియర్
హీరోయిన్స్ క్రేజ్ ను సూచిస్తోంది..